Home » Canada
Modi Meloni Moments: జీ7 సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జీ7కు హాజరైన మోదీ, మెలోని కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
ప్రధాని మోదీ కెనడా పర్యటన సందర్భంగా ఖలిస్థానీ వేర్పాటువాదులు ఆకస్మిక దాడికి కుట్రపన్నారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు మోదీ మంగళవారం కెనడాకు చేరుకున్నారు.
సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ ఈనెల 15, 16 తేదీల్లో ఆ దేశంలో అధికారిక పర్యటన జరుపుతారు. రెండు దశాబ్దాలుగా ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం.
శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఇండియా-కెనడా గౌరవించుకుంటూ, పరస్పర ప్రయోజనాలు పొందే దిశగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాయని మోదీ చెప్పారు. జీ7 సదస్సులో మార్క్ కార్నీతో సమావేశానికి ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
కెనడాలోని అన్ని రాజకీయ పార్టీలు ఖలిస్థానీ వేర్పాటువాద పార్టీలతో అన్ని సంబంధాలు తెంచుకోవాలని మాజీ ప్రధాని హార్పర్ సూచించారు.
భారీ స్థాయిలో వలసల నేపథ్యంలో కెనడా అనుసరిస్తున్న కఠినమైన వీసా నిబంధనల కారణంగా ఆ దేశానికి వెళ్లి చదువుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
సోషల్ మీడియాలో ప్రతి రోజు కూడా అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే వైరల్ అయిన వీడియోలో భారత ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ల దిష్టిబొమ్మలను జైలు లాంటి బోనులో పెట్టి, ప్రజాసమూహం ముందు ఊరేగించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై వ్యతిరేకత కెనడాలో లిబరల్ పార్టీకి అనుకూలంగా మారి, మెక్కార్నీ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఖలిస్తానీ అనుకూల ఎన్డీపీ పతనంతో భారత్–కెనడా సంబంధాలు మెరుగయ్యే అవకాశం కనిపిస్తోంది.
భారతదేశం-కెనడా సంబంధాల విషయంలో గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో మార్క్ కార్నీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన భారత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.