Home » Central Govt
సీఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావటం అభినందనీయమని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. వాణిజ్య ప్రదర్శనలకు, ఎగ్జిబిషన్లు, సదస్సులకు వీలుగా ఢిల్లీలో భారత్ మండపం ఉన్నట్లే ఆంధ్రా మండపం నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఏపీలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి లేఖ రాశారు.
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల ఘటనపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు పేల్చాలని ఓ వర్గం వాళ్లు కుట్ర పన్నారని ఆరోపించారు.
గుంటూరు జిల్లాలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి పనులని ప్రారంభించారు.
హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఓటు చోరీపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్.
రైతులు సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలని కేంద్రమంత్రికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రైతులు దూరప్రాంతాలకు వెళ్లకుండా ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వినతి చేశారు.
దేశంలో ఎన్ని మార్పులు వచ్చినా.. వ్యవసాయం ఇప్పటికీ మన జీవన విధానంలో భాగమేనని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. అగ్రి బిజినెస్ అవార్డులు ఇవ్వడం ద్వారా భారతదేశ వ్యవసాయ రంగానికి ఎనలేని సేవలు అందిస్తున్న రైతులు, ఇన్నొవేటర్స్, అగ్రిప్రెన్యూర్స్లని గౌరవించుకోవడమేనని పేర్కొన్నారు కిషన్రెడ్డి.
ఏపీ అభివృద్ధికి కేంద్రంగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం 91.7 శాతం పూర్తి అయిందని పేర్కొన్నారు.
వందేమాతరానికి 150 సంవత్సరాలు అయినందున ప్రత్యేక కార్యక్రమం నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. నవంబరు 7వ తేదీన దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందేమాతరం గేయం పాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.