Home » Central Govt
కాశీబుగ్గ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీబుగ్గ ఘటన తీవ్రంగా కలచివేసిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొరెన్సిక్ అధికారికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కింది. 2025 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘కేంద్రీయ గృహమంత్రి దక్షిత’ పతాకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (APFSL) DNA విభాగంలో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్న బొమ్మకంటి ఫణిభూషన్ ఎంపికయ్యారు.
భారత్- చైనా సరిహద్దు ప్రాంతాల్లో సంయుక్తంగా శాంతిని కాపాడేందుకు అంగీకరించారని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ చర్చల విషయాన్ని తాజాగా భారత ప్రభుత్వం కూడా ధ్రువీకరించింది.
తెలంగాణలో రైతుల అవసరాలకు అనుగుణంగా సరిపోయే యూరియాను కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల్లోని ఎరువుల తయారీ కంపెనీల నుంచి ఎరువులను సేకరించడంతోపాటుగా.. విదేశాల నుంచి పెద్దఎత్తున దిగుమతి చేసుకోవడం ద్వారా.. దేశంలో యూరియా కొరత తగ్గించేందుకు కేంద్రం చొరవ తీసుకుందని పేర్కొన్నారు కిషన్రెడ్డి.
ఏపీలో మొంథా తుపాను ప్రభావంపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. ఈ మేరకు ఏపీ వైద్యా, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పెసర, మినుము పంటలను వందశాతం వరకు, సోయాబీన్ను 50శాతం వరకు MSP కింద కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న, జొన్న పంటలను కూడా ప్రైస్ సపోర్టు స్కీమ్లో చేర్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ మెట్రో ఫేస్-2 విస్తరణకి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు. సబర్మతి నిరాశ్రయులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు.
ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి యోజన అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000లను అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికీ రూ.2,000 చొప్పున మూడు వాయిదాల్లో చెల్లిస్తారు.
దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పించుకోలేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. దేశ అంతర్గత భద్రత విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు బండి సంజయ్.
న్యాయం కోసం పోరాడిన తమకు న్యాయం లభించలేదని శాంతిప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ విధించి మరీ మావోయిస్టులను చంపుతోందని ఆరోపించింది.