Home » Chennai News
ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలుసుకుని కారులో తిరిగి వెళుతూ తాను ముఖం చాటేశానంటూ వస్తున్న విమర్శల్ని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) కొట్టిపారేశారు. చెమటపడితే రుమాలుతో తుడుచుకుంటూ వెళ్లానని, దానిపై ప్రసార మాధ్యమాలకు తోడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రహ్మకమలం అనే పువ్వు 12యేళ్లకు ఒకసారి మాత్రమే వికిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కోవకు చెందిన నీలంరంగు కురిం జి పుష్పం పుష్కర కాలం తరువాత ప్రస్తుతం నీలగిరి, కొడైకెనాల్ పశ్చిమ కనుమల్లో విరబూసింది.
తన సభలకు కూడా జనం భారీగా హాజరయ్యేవారని బీజేపీ నేత శరత్కుమార్ వ్యాఖ్యానించారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ చేపట్టిన ప్రచారానికి లక్షలాది మంది తరలిరావడంపై పలు పార్టీల నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
జెండా స్తంభాల తొలగింపులో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మద్రాసు హైకోర్టు ప్రశంసించింది. రాష్ట్రవ్యాప్తంగా రద్దీ ప్రాంతాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన, ప్రైవేటు స్థలాల్లో రాజకీయ పార్టీలు, మత, కుల సంఘాలు ఏర్పాటుచేసిన జెండా స్తంభాలు తొలగించాలని హైకోర్టు మదురై ధర్మాసనం జనవరిలో ఉత్తర్వులు జారీచేసిన విషం తెలిసిందే.
పెరంబలూరు జిల్లా గోల్కానత్తం ప్రాథమిక కేంద్రానికి సాధారణ రోగి వేషంలో వెళ్లిన జిల్లా కలెక్టర్ మృణాళిని అక్కడ ప్రజలకు ఏవిధంగా వైద్యం అందుతుందో పరిశీలించారు. ఇటీవల గోల్కానత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కు.ని శస్త్రచికిత్స చేయించుకున్న ఓ మహిళ.. ఆస్పత్రిలో చికిత్స సరిగ్గా లేదంటూ జిల్లా కలెక్టర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసింది.
రాష్ట్రంలో అధికార భాగస్వామ్యం పొందాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఎప్పుడూ చెప్పలేదని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై పేర్కొన్నారు. బుధవారం పెరియార్ జయంతి సందర్భంగా నగరంలోని సిమ్సన్ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
పార్టీ నుంచి బహిష్కృతులైన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం (ఓపీఎస్), వీకే శశికళను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు స్పష్టం చేశారు.
ఆయుధపూజ, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06012 నాగర్కోయిల్-తాంబరం ప్రత్యేక వారాంతపు సూపర్ ఫాస్ట్ రైలు ఈ నెల 28, అక్టోబరు 5,12,19,26 తేదీల్లో (ఆదివారం) నాగర్కోయిల్లో రాత్రి 11.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది.
పాకాలవారిపల్లె అటవీ ప్రాంతంలో మంగళవారం బయటపడిన మృతదేహాలు తమిళనాడుకు చెందిన వారివిగా నిర్దారణ అయింది. ఆదివారం సాయంత్రం ఈ అడవిలో ఓ పురుషుడు శవం చెట్టుకు వేలాడుతుండటం, ఓ మహిళ మృతదేహం సమీపాన పడి ఉండటం, అక్కడే పూడ్చిపెట్టిన రెండు గోతులను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.
నీలగిరి జిల్లా కూడలూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 12 మందిపై దాడిచేసి హతమార్చిన అడవి ఏగును బందించాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ రాకేష్ కుమార్ డోగ్రా ఆదేశించారు.