Home » China
మన దేశం నుంచి చైనాకు గతంలో ఎక్కువగా బట్టలు, రసాయనాలు, లోహాలు వంటివి ఎగుమతి అయ్యేవి. కానీ ప్రస్తుతం సీన్ మారింది. ఇప్పుడు మన ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు చైనా మార్కెట్లో హవా చేయనున్నాయి.
ఎస్సీఓలో భారతదేశం కీలక భూమిక పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎస్సీఓకు కొత్త నిర్వచనం చెప్పారు. ఎస్ అంటే సెక్యూరిటీ, సీ అంటే కనెక్టివిటీ, ఓ అంటే ఆపర్చునిటీ అని తెలిపారు. భద్రత, అనుసంధానం, అవకాశం అని చెప్పారు.
న్యాయమైన, సహేతుకమైన ప్రపంచ పాలన వ్యవస్థను నిర్మించడాన్ని అందరూ కృషి చేయాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తెలిపారు. సభ్య దేశాలు SCO సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం, వనరుల ఇన్పుట్, సామర్థ్య నిర్మాణాన్ని పెంచడం, నిర్ణయాలు మరింత శాస్త్రీయంగా తీసుకోవడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
చైనాలోని టియాంజిన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు దర్శనమిచ్చాయి. మోదీ, పుతిన్ కలుసుకోగానే హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు.
సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేసి, అన్ని రంగాల్లోనూ కలిసి పని చేయాలని భారత్, చైనాలు నిర్ణయించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాల దాడికి దిగడంతో ప్రధాని మోదీ అప్రమత్తమయ్యారు. చైనాతో కలిసి ముందుకెళ్లాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
భారత్, చైనా సైతం ఉగ్రవాద బాధిత దేశాలేనని జిన్పింగ్ దృష్టికి మోదీ తీసుకువచ్చారని, దీనిపై చైనా మద్దతు కోరారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి వచ్చేందుకు చైనా సుముఖత వ్యక్తం చేసిందన్నారు.
ఇండియాకు చెందిన ఓ ప్రముఖ జాతీయ మీడియా జర్నలిస్ట్ ‘క్షివావ్ హ’ను ఇండియా గురించి ఓ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు ‘క్షివావ్ హ’ చెప్పిన సమాధానం విని అతడు ఆశ్చర్యపోయాడు.
భారత్-చైనా స్నేహంగా ఉండటం సరైన నిర్ణయమని, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు గ్లోబల్ సౌత్లో ముఖ్యమని, ఇరుదేశాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సంబంధాల పునరుద్ధరణ బాధ్యత తాము తీసుకున్నామని జిన్పింగ్ చెప్పారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను భారత్కు రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. 2026లో జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి రావాలని మోదీ కోరారు. టియాంజిన్లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు పాల్గొన్నారు.
గతంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన వేళ టిక్టాక్ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. అప్పట్నుంచి భారత్లో టిక్టాక్ కార్యకలాపాలకు ఫుల్స్టాప్ పడింది. అయితే ప్రస్తుతం భారత్, చైనాల మధ్య స్నేహం చిగురిస్తోంది.