Home » Chittoor
ఎడమచేతి వాటం కలిగిన వారిని ఒకప్పుడు పుర్రచెయ్యోడు లొడ్డోడు.. అని ఎగతాళి చేసేవారు. ఎడమచేతిని వాడటం ఏ రకంగానూ లోపం కాదు అయినా ఇప్పటికీ కుటుంబాల్లో కూడా ఎంతో కొంత గాయపడే మాటలు విసురుతూనే ఉంటారు. బలవంతంగా కుడి చేతిని వాడాలని వేధిస్తుంటారు.
ప్రపంచ ఫొటోగ్రఫీ డేని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీపీజేఏ) నిర్వహంచిన జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో తిరుపతి ఆంధ్రజ్యోతి స్టాప్ ఫొటోగ్రాఫర్లు ఆర్ లావణ్య కుమార్, కె.సాయికుమార్లకు బహుమతులు లభించాయి.
సుదుటిపై మూడు నామాలతో జన్మించిన ఆవుదూడను చూసి అంతా ఆశ్చర్యపోయారు. చౌడేపల్లె మండలం గడంవారిపల్లె పంచాయతీ పెద్దకంపల్లెకు (యల్లంపల్లె) చెందిన రవినాయుడు సంబంధించిన పశువులకు గత ఏడాది లంపిస్కిన్ వ్యాధి సోకడంతో నయమైతే ఓ దూడను టీటీడీ గోశాలకు ఇస్తానని మొక్కుకున్నాడు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారులకు ప్రాధాన్యత ఇచ్చి రూ.222 కోట్లతో మరమ్మతులు, అభివృద్ధి చేయగా..తాజాగా మరిన్ని ఆర్అండ్బీ రహదారుల అభివృద్ధికి రూ.38.25 కోట్లను విడుదల చేసింది.
గుడికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
తిరుపతి జిల్లా పోలీసుల పొదిలోకి ఇటీవల అందిన ఒక సాంకేతిక ఆయుధం డ్రోన్ భిన్న అవసరాలకు ఉపయోగపడే వివిధ సామర్థ్యాలున్న 9 డ్రోన్లు ప్రభుత్వం తిరుపతికి కేటాయించింది. దేశ నలుమూ లల నుంచి వచ్చే జనంలో నేరస్థులు సులువుగా కలగలిసిపోయే అవకాశమున్న ప్రాంతం కావడంతో వీటి అవసరం మరీ ఎక్కువ. అలాగే తరచూ వీవీఐపీల పర్యటనలు, భారీ సభలు జరుగుతుండటంతో క్రౌడ్ కంట్రోల్కి కూడా డ్రోన్ల సాయం పోలీసులకు బాగా ఉపయోగపడుతోంది.
సింహం.. అడవికి రారాజు.. ధైర్యసాహసాలకు మారుపేరు. వేటాడటంలో దీని నైపుణ్యమే వేరు. బాల్యంలో కథా వస్తువుగా నిలిచే ఈ మృగరాజు ఆఫ్రికన్ దేశాల్లో హవా చాటుకుంటున్నా మనదేశంలో అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరిపోయింది.
తిరుపతి వైసీపీ నేతల చేతుల్లో గాయపడిన బాధితుడు పవన్ ప్రస్తుతం మిస్సింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఇంటికి రాకపోవడంతో పవన్ తల్లిదండ్రులు తల్లడిల్లుపోతున్నారు. పవన్ ఎక్కడున్నావ్ నాన్న.. త్వరగా ఇంటికి రా అంటూ..
డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిట్ట. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఫ్యాన్ పార్టీ నేతలు పలుచన అవుతున్న క్రమంలోనే పలాయన వాదం అందుకున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చంద్రబాబుకు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య గతంలో గొడవలు జరిగాయన్న విషయాన్ని ఇప్పుడు జగన్ అండ్ కో లేవనెత్తారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు.