Home » CJI
'నీట్' లో అవకతవకలపై మంగళవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా మధ్యలో అవాంతరం కలిగించేందుకు ప్రయత్నించిన ఒక న్యాయవాదిపై సీజేఐ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సెక్యూరిటీని పిలవండి' అంటూ సీరియస్ అయ్యారు.
పిల్లల పట్ల ఉపాధ్యాయుల ప్రవర్తన వారి మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. చిన్నప్పుడు పాఠశాలలో టీచరు చేతిలో బెత్తం దెబ్బలు తిన్న అనుభవాన్ని ఇప్పటికీ మరిచిపోలేనన్నారు.
ఎందుకో తెలీదు కానీ.. తమకు ఓటు హక్కు ఉన్నప్పటికీ కొందరు దానిని వినియోగించరు. పోలింగ్ బూత్కి వెళ్లి ఓటు వేయరు. ఈ నేపథ్యంలోనే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్ ఓటర్లకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి..
న్యాయవ్యవస్థను దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ లాయర్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కి రాసిన లేఖపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇతరులను వేధిస్తూ, వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు.
ఎలక్టోరల్ బాండ్స్ కేసుపై సోమవారంనాడు విచారణ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ ఆగ్రహానికి గురయ్యారు. ''నాపై అరవొద్దు'' అంటూ ఒక లాయర్ను మందలించారు. రద్దయిన ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్పై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కరోనా(Covid 19) విపత్తు ఎన్నో కుటుంబాల్లో తీరని విషదాన్ని మిగిల్చిన విషయం విదితమే. పేద, మధ్య తరగతి, ధనిక ఇలా.. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరినీ ఈ వైరస్ చుట్టుముట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI Chandrachud) సైతం కరోనా బారిన పడ్డారు.
భారత అత్యున్నత న్యాయస్థానంలో ఇంట్రస్టింగ్ సీన్ నడిచింది. ఓ కేసులో విచారణ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ముఖుల్ రోహత్గీ రెండు మద్యం బాటిళ్లను తీసుకువచ్చి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందు పెట్టారు. ఆ బాటిళ్లను చూసి సీజేగా గట్టిగా నవ్వేశారు. ఈ బాటిళ్లను మీరే తెచ్చారా? అంటూ న్యాయవాదిని అడిగారు. దానికి అవునని బదులిచ్చిన న్యాయవాది.. కేసులో సారూప్యతను వివరించడం కోసం వీటిని తీసుకురావడం జరిగిందని వివరించారు.
శ్రీకృష్ణ భగవానుడు కొలువైన ద్వారకను భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శనివారంనాడు దర్శించుకున్నారు. ద్వారకాధీశుని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పసుపు రంగు దుస్తులు ధరించి సతీ సమేతంగా ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. సీజేఐ రాక సందర్భంగా ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్లోని ఓ మహిళా న్యాయమూర్తి సీనియర్ల వేధింపులు తాలలేక ఆత్మహత్యకు అనుమతి కోరుతూ రాసిన బహిరంగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కోర్టు ముందుకు వచ్చిన కేసులను వాయిదా వేయాలని కోరటాన్ని సుప్రీం కోర్టు(Supreme Court) సీజేఐ జస్టిస్ చంద్రచూడ్(CJI Justice Chandrachud) తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసు వాయిదాలతో "తారీక్ పే తరీక్"(తేదీ తరువాత తేదీ)గా కోర్టు మారకూడదని ఉద్ఘాటించారు. గడిచిన రెండు నెలల్లో 3,688 కేసులను న్యాయవాదులు వాయిదా వేయాలని కోరారని వెల్లడించారు.