Home » CM Chandrababu Naidu
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు.
తమ ప్రభుత్వంలో అత్యాధునిక విద్యను అందించడానికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ దిశగా ఉపాధ్యాయుల్లో నైపుణ్యలు పెంపొందించడానికి విదేశాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు.
పులివెందుల పట్టణానికి.. నాడు సాగునీరు.. నేడు తాగునీరు.. ఆ ఘనత చంద్రబాబునాయుడిదేనని పలువురు పేర్కొంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే పులివెందుల బీడు భూముల్లో క్రిష్ణమ్మ జలాలు సవ్వడి చేస్త్తుంటే.. ఇప్పుడు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది.
ఫైబర్ నెట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసులో మదుసూధన్ రెడ్డి ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. అయితే ఈ కేసును మూసి వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దేశంలో ఎక్కడా కూడా పింఛన్లకు రూ.6 వేలు ఇచ్చే ప్రభుత్వం లేదని.. ఒక్క ఏపీలో మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రూ.3 వేల పింఛన్ను రూ.6వేలకు పెంచామని గుర్తుచేశారు.
రెండోవిడత భూసేకరణ కోసం గ్రామాల్లో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్ 5వ తేదీ తర్వాత రెండో విడత భూ సేకరణ ప్రారంభవుతోందని వివరించారు. భూసమీకరణలో అనుభవం ఉన్న అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించామని పేర్కొన్నారు.
జఠిలమైన వ్యవసాయ సమస్య పరిష్కరించడానికి ఐదు సూత్రాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.. ఇందులో భాగంగానే నీటి భద్రత కల్పించాలని భావించామని పేర్కొన్నారు. గంగా, కావేరి నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించామని తెలిపారు.
పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబే... అని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత అన్నారు. జిల్లాలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు హాయంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతోందన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని మంత్రి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోకి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను, ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్లను చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం.