Home » CM Chandrababu Naidu
Andhrapradesh: మేనిఫెస్టోలో పెట్లిన సూపర్ సిక్స్ అమలు చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పల్లా పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గం 67వ వార్డు హై స్కూల్ రోడ్లో పింఛన్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక పండుగ వాతావరణం కనిపిస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఆత్మకూరు మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరిగింది. ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీ పార్థసారథి పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు 7 వేల రూపాయలు అందిస్తున్నారన్నారు.
మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ గెలుపుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ గెలుపుపై తొలిసారి చంద్రబాబు స్పందించారు. గత ఎన్నికల్లో లోకేష్ ఓడినా మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేశారన్నారు. ప్రజలందరి అభిమానం చూరగొని లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలిచారన్నారు.
సామాజిక భద్రత ఫించన్లు దేశంలో కోట్లాది మంది జీవితాలకు భద్రత కల్పిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతినెల ప్రభుత్వం అందిస్తుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఫించన్లు అందిస్తుంటారు.
తూర్పు నియోజకవర్గంలో పెన్షన్ల పండుగను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. వరలక్ష్మీ నగర్, నాగార్జున నగర్, పోలీస్ కాలనీల్లో పేదలకు స్వయంగా గద్దె రామ్మోహన్ పెన్షన్ అందజేశారు. వైసీపీ ప్రభుత్వంలో తమ పెన్షన్ తొలగించారని ఎమ్మెల్యేకు పలువురు వృద్దులు తెలిపారు. ఆగస్ట్లో అర్హత ఉన్న వారికి పెన్షన్ లు మంజూరు చేసేలా చూస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చారు.
ఒకటో తారీఖు వచ్చేసింది. పెన్షన్ వస్తుందా? లేదంటే లేటవుతుందా? అనే చింత లేకుండా తెల్లవారేపాటికి తానే ఒక సైన్యంగా మారి సీఎం చంద్రబాబు ఇంటింటికీ తిరుగుతూ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ప్రారంభించారు.
ఏపీలో పండగ వాతావరణం నెలకొంది. ఒకటో తేదీన ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయో లేదో తెలీదుకానీ.. 65లక్షల మందికి పైగా పెన్షన్ దారులకు పెన్షన్ (Penssion) డబ్బులు అందుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచిన సంగతి తెలిసిందే. ఆ పెంచిన పెన్షన్ను జులై-01న స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అందజేయబోతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు (CM Nara Chandra Babu Naidu) ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్ని నెరవేస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వ జన్మ సుకృతమని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఒక్కొక్కటిగా నేరవేరుస్తున్నారు. హామీల్లో భాగంగా పెంచిన పెన్షన్(Pension) రూ.4వేలు ఇచ్చేందుకు జులై 1నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లి మండలం పెనుమాక గ్రామం వేదిక కానుంది.