Home » CM Chandrababu Naidu
రాసలీలల ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది..
తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్న వేళ సినిమా రంగానికి చెందిన వారు ఎందరో తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు.
అమరావతి: విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతోంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడుస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి తెల్లవారులు దగ్గర ఉండి పనులు చేస్తున్నారు. మళ్లీ బుడమేరకు వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శరవేగంగా గండ్ల పూడుస్తున్నారు.
వైసీపీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చింది రాష్ట్ర హైకోర్టు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదని హైకోర్టు స్పస్టం చేసింది. వాస్తవానికి ఈ కేసును బుధవారం ఉదయమే విచారించిన హైకోర్టు..
విజయవాడ, గుంటూరు జిల్లాల్లో తెల్లవారుజామున 2.30 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారుల్లో ఆందోళన చోటు చేసుకుంది.
ఎక్కడుంది లోపం.. ఎవరిది వైఫల్యం.. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగినా..
విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎఎల్) స్పందించింది. తక్షణ సహాయానికి ముందుకొచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మొదటి రోజు లక్ష మందికి ఆహారాన్ని పంపిణీ..
నాలుగున్నర గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీల ద్వారా బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. భవానీపురం నుంచి సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్నా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు.
ఊహించని ఉపద్రవం వారిని ముంచెత్తింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన రాకసి వరద.. నిలువ నీడ లేకుండా చేసింది. ఇళ్లకు ఇళ్లను ముంచెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలు మినహా దిక్కులేక ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆదుకోండయ్యా అని దీనంగా చూస్తున్నారు.
కష్టాల్లో ఉన్నవారిని వదిలేయలేదు.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వరదైనా.. బురదైనా తడపడలేదు. తన ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు. కాన్వాయ్ని సైతం పక్కన పెట్టేసి.. నేరుగా బురద నీటిలోకి దిగి మరీ ప్రజల వద్దకు వెళ్లారు. సీఎం అంటే ఇలా ఉండాలని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.