Home » CM Chandrababu Naidu
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్లో విలీనమైన భద్రాచలం మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసేలా చొరవ తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఈనెల ఆరో తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Telangana: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చిచేందుకు ఈనెల 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవనున్నారు. ఇరు ముఖ్యమంత్రుల భేటీపై ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ సద్దాం ఉస్సేన్ ని సస్పెండ్ అయ్యారు. జాయింట్ కలెక్టర్ ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈయన గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథే ఉంది. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి డబ్బులు లంచం అడిగిన చరిత్ర ఈయనది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆయనకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఈ సమావేశం జరగనుంది..
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో 12గంటల వ్యవధిలో రూ.4,170 కోట్లు పెన్షన్ల(Pension Distribution) రూపంలో పంపిణీ చేసి ఎన్డీయే ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి (Minister Parthasarathy) అన్నారు. ఇవాళ(సోమవారం) ఉదయం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ 95శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ఏపీ పోలీసులపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి (Mandipalli Ram Prasad Reddy) సతీమణి హుకుం జారీ చేశారు. తన వెంట స్థానిక ఎస్ఐ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్లో పోలీసులపై జులుం ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ(Pension Distribution) కార్యక్రమం జరిగింది. ఇవాళ(సోమవారం) ఒక్క రోజులో 95శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసి చంద్రబాబు(CM Chandrababu) సర్కార్ రికార్డు సృష్టించింది. సాయంత్రం ఏడు గంటల సమయానికి కల్లా 61,60,825మందికి నగదు పంచి 94.15శాతం మేర పంపిణీ పూర్తి చేశారు.
లడాఖ్ టీ-72 యుద్ద ట్యాంక్ కొట్టుకుపోయిన ఘటనలో పలువురు సైనికులు వీర మరణం పొందారు. వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి, సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్ అనే ముగ్గురు సైనికులు ఉన్నారు. సైనికుల మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
Andhrapradesh: ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు.. జీతాల కోసం ఎదురు చూపులు చూసేవారు. జీతాలు ఎప్పుడు పడతాయా అంటూ పడిగాపులు కాసేవారు. ఎంతగా ఎదురు చూసినప్పటికీ వారి ఆశ నిరాశే ఎదురయ్యేది. గత నాలుగునరేళ్లుగా ఇదే పరిస్థితిని చవిచూశారు ఉద్యోగులు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.