Home » CM Chandrababu Naidu
Andhrapradesh: టీడీపీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. అప్పటిలో చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి కేసులో ఆయన కుడి కన్ను కోల్పోయిన విషయం తెలిసిందే. కుడి కంటి చూపు కోల్పోవడంతో అప్పట్లో గాంధీకి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చికిత్స చేయించారు.
Andhrapradesh: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. సుమారు అరగంట పాటు సమావేశం కొనసాగింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. పోలవరం, అమరావతి నిర్మాణానికి కేంద్ర నుంచి ఆర్థిక సాయాన్ని అందించాల్సింది బాబు కోరినట్లు సమాచారం.
ఏపీలో ఇవాళ ఇంట్రస్టింగ్ టాపిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల షెడ్యూల్ ఆసక్తికర చర్చకు దారి తీసింది...
Andhrapradesh: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. అమరావతి, పోలవరంతో పాటు ఏపీకి చెందిన పలు అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బాబు... పలువురు కేంద్ర పెద్దలతో భేటీ అవుతున్నారు. నిన్న(బుధవారం) సాయంత్రమే ముఖ్యమంత్రి హస్తినకు చేరుకున్నారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న (బుధవారం) ఢిల్లీకి చేరుకున్న సీఎం... మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఛీఫ్ నియామకంపై అధిష్టాన ముఖ్యులతో భేటీ అయ్యారు. ఈరోజు(గురువారం) కాంగ్రెస్ పెద్దలతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో రేవంత్ భేటీకానున్నారు.
నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10.15 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం 9 గంటలకు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు భేటీ జరగనుంది. 12.15 గంటలకు కేంద్రమంత్రి మంత్రి నితిన్ గడ్కరీ, 2 గంటలకు వ్యవసాయ, గ్రామాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.. 2.45 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈనెల 5న తొలిసారి హైదరాబాద్కు చంద్రబాబు రానున్నారు. దీంతో ఏపీ సీఎంకు పెద్దఎత్తున వెల్కమ్ చెప్పేందుకు టీటీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం 4గంటలకు బేగంపేట్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు అర్వింద్ కుమార్ గౌడ్ తెలిపారు.
అభ్యర్థుల అభ్యర్థన మేరకు టెట్, డీఎస్పీకి మరింత సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 90 రోజుల్లో టెట్ తర్వాత 90 రోజుల్లో డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రాష్ర్ట్ంలో ఉచితంగా ఇసుక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) వెల్లడించారు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ(Sand Policy) అమలు కానుందని, దీని వల్ల రాష్ట్రంలో ఎంతోమందికి ఉపాధి అవకాశాలూ దొరుకుతాయని మంత్రి చెప్పుకొచ్చారు.
రాజధాని కోసం అమరావతిలో భూమి ఇచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని కోసం 53, 748 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. 8278 ఎకరాల భూమిని మానిటైజేషన్ కోసం ఉంచామని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని భూములపై బుధవారం నాడు ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.