Home » CM Chandrababu Naidu
Andhrapradesh: ఏపీ వరద బాధితులకు సుప్రీం కోర్టు తెలుగు న్యాయవాదులు విరాళం అందజేశారు. దాదాపు రూ.15లక్షలు విరాళంగా ఇచ్చారు. బుధవారం నాడు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ను కలిసి తెలుగు న్యాయవాదులు చెక్కులు అందజేశారు.
నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నామినేటెడ్ పదవులు పొందిన వారితో ఏపీ సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
అటు ప్రధాని మోదీ, ఇటు సీఎం చంద్రబాబు ఇద్దరూ కలిసి ఏపీని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటికే రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు, పోలవరం మెుదటి దశ పనుల కోసం రూ.12,567కోట్లు కేంద్రం ప్రకటించిందని ఆయన తెలిపారు.
మాజీ సీఎం జగన్ పరిపాలనపై విసుగెత్తి కూటమి సర్కార్కు అధికారం కట్టబెడితే ఈ ప్రభుత్వం కూడా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ సూపర్ సిక్స్ అమలు చేయలేదన్నారు.
Andhrapradesh: విజయవాడ కలెక్టరేట్లో వరద బాధితులకు నష్ట పరిహారాన్ని సీఎం చంద్రబాబు అందజేశారు. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం సాయం అందిస్తుంది. నేరుగా వరద బాధితుల ఖాతాల్లోకి నష్టపరిహారం సొమ్మును జమ చేశారు. ఎన్యూమరేషన్ పూర్తి కావడంతో అర్హులైన బాధితులందరికీ వారి ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ కానున్నాయి.
Andhrapradesh: బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కనీస బాధ్యత లేకుండా ఆంబోతుల మాదిరి వ్యవహరించారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బోట్ల విషయంలో కుట్ర పన్నిన వారిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
వరద సహాయ కార్యక్రమంలో అధికారులు మంత్రులు ఒక స్పిరిట్తో పనిచేశారని, ఇంత పెద్ద ప్రకృతి విపత్తులో తనతో పాటు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది 10 -11 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. వరద నీటిలో ఉన్న బాధితులకు అన్ని రకాలూగా సాయం అందించే ప్రయత్నం చేశామన్నారు.
Andhrapradesh: మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. పార్వతమ్మ ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేష సేవలందించారని కొనియాడారు.
విజయవాడ వరదలకు బ్యాక్టీరియా వల్ల కాలు కోల్పోయిన బాధితుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ధిక సాయం అందజేసి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. రూ. 10 లక్షల ఎల్ఓసీ ఇస్తూ లేఖ విడుదల చేశారు. జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీలో వరదల వల్ల వచ్చిన బాక్టీరియాతో బాధితుడు ఒక కాలు కోల్పోయాడు.
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఇండియాకు తిరిగి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మోదీ లాంటి రాజనీతి గలవారి నాయకత్వంలో పనిచేయడం మా అదృష్ట’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.