Home » Congress
అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు లేదా అంతకు మించి నిర్వహించినా తాము సిద్ధమే అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్న బిహార్ దర్భంగా ఓటర్ అధికార్ యాత్ర సభ వేదికపై నుంచి ప్రధాని మోదీ తల్లిని కొందరు దూషించడంపై కలకలం రేగుతోంది....
ప్రధానమంత్రి తల్లిని అవమానపరిచిన కాంగ్రెస్కు తాము గట్టి సమాధానం చెబుతామని బీజేపీ నేత నితిన్ నబీన్ తెలిపారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. కాంగ్రెస్ సైతం బీజేపీపై విరుచుకుపడింది. ఈ ఘటన వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని, నితీష్ చాలా తప్పుచేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్త డాక్టర్ అశుతోష్ అన్నారు.
ముసాయిదా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బాగంగా బిహార్లోని మూడు లక్షల మందికి ఈసీ నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. వారి దరఖాస్తుల్లోని వివరాల మధ్య వ్యత్యాసాలను అధికారులకు వచ్చి వివరించాలని ఈసీ ఆదేశించింది.
‘నాకు ఏమైనా జరిగితే అందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంద’ని చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి పేర్కొన్నారు. అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్లు, ఆఫ్లైన్ బెట్టింగ్ల ఆరోపణల మేరకు ఈడీ అధికారులు గత వారం దాడి చేసి రూ.12 కోట్ల నగదుతో పాటు కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
దర్భంగా జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని బీజేపీ నాయకుడు కృష్ణ సింగ్ కల్లు ఆరోపించారు. ప్రపంచంలో లేని వ్యక్తి గురించి దుర్భాషలు ఆడటం బాధాకరమన్నారు.
ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఒక తీర్పు కారణంగా కొన ఊపిరితో ఉన్న నక్సలైట్ ఉద్యమం మరో రెండు దశాబ్దాల పాటు దేశంలో మనగలిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు.
కడియం శ్రీహరికి ఘన్పూర్ అభివృద్ది ఇప్పుడు గుర్తొచ్చిందా అని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రశ్నించారు. కడియంకు తన అభివృద్ధి తప్పా.. ఘన్పూర్ అభివృద్ధితో పనిలేదని విమర్శించారు. ఘన్పూర్లో కడియం మార్క్ ఎక్కడా కనిపించదని తాటికొండ రాజయ్య ఆరోపించారు.
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) సోమవారం ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటతిల్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఎందుకంటే? అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉన్న అవకాశాలపై న్యాయకోవిదుల సలహా కోరేందుకు మంత్రుల కమిటీ సోమవారం ఢిల్లీకి వెళ్లనుంది.