Home » Congress
డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు పూర్వం సిద్ధాంతపరంగా వేర్వేరు మార్గాల్లో పయనించినా ప్రస్తుతం దేశ సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి ఒకే కూటమిలో కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. మతత్త్వపార్టీ బీజేపీకి వ్యతిరేకంగా రెండు పార్టీలూ సమైక్యంగా పోరాడుతున్నాయని చెప్పారు.
బావ, బామ్మర్దుల నస భరించాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు పట్టిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్న పదేళ్లు బందిపోట్ల లాగా దోచుకున్నారని ఆయన
స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్ వంటి ప్రముఖులు ఉన్నారు. సచిన్ పైలట్, భూపేష్ బఘేల్, గౌరవ్ గొగోయ్, కన్హయ్య కుమార్, జిగ్నేష్ మేవాని, దిగ్విజయ్ సింగ్, రణ్జీత్ రంజన్, తారిఖ్ అన్వర్ తదితరులు కూడా ఈ జాబితాలో చోటుచేసుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం శనివారం నుంచి హోరెత్తనుంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో ప్రచారంలో స్పీడ్ పెంచాలని అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.
శనివారం నుంచి జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేయాలని కాంగ్రెస్ నాయకులకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ డివిజన్కు ఇద్దరు మంత్రుల చొప్పున 13 మంది మంత్రులకు ప్రచార బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.
1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడానికి ఇద్దరు పిల్లల నిబంధనను అమల్లోకి తెచ్చింది. 1994 తర్వాత మూడో సంతానం కలిగిన వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా మారారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్ నామినేషన్ల ఘట్టమే రసకందాయమైంది. మొత్తం 211 మంది అభ్యర్థులు ఈ ఉపఎన్నికకు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ నామినేషన్పై అభ్యంతరాలు..
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకోనుండటం, రొటేషనల్ పద్ధతిలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు పదోన్నత కల్పించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వస్థీకరణ చోటుచేసుకోనుంది.
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పులు జరుగనున్నాయని, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారంటూ కొద్దికాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం వచ్చే నవంబర్లో రెండున్నరేళ్లు పాలన పూర్తి చేసుకోనుంది.
కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. బుధవారం సిద్ధిపేటలో ఆయన పర్యటించారు. పట్టణంలోని 7వ వార్డులోని కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు.