Home » Congress
కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ, ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు రామిరెడ్డి దామోదర రెడ్డి పేరుకు ఆమోదం, కాళేశ్వరం పునరుద్ధరణ, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల నిర్మాణం సహా పలు నీటి పారుదల ప్రాజెక్టులపై కేబినెట్ చర్చించనుంది.
బిహార్ శాసనసభ ఎన్నికలకు కర్ణాటక నుంచి భారీగా నగదు సమకూరుస్తున్నారని శివమొగ్గ ఎంపీ బీవై రాఘవేంద్ర ఆరోపించారు. ఈ అంశంపై గడిచిన కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతోంది.
కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు డిమాండ్ చేస్తుండగా 52 నుంచి 55 సీట్లు ఇస్తామంటూ ఆర్జేడీ ప్రతిపాదించింది. దీంతో ఇరు భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయలోపం తలెత్తింది. ఇదేవిధంగా వామపక్ష పార్టీలు 40 సీట్లు అడుగుతున్నాయి.
హరీష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి డిమాండ్ చేశారు. కేబినెట్ మంత్రులను దండుపాళ్యం బ్యాచ్ అంటారా అంటూ ఫైర్ అయ్యారు.
రాజయ్య ఎవరికి ఫోన్ చేయబోయి ఎవరికి చేస్తే... మంత్రి పదవి ఊడిందో తెలియదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్ చేశారు. రాజయ్యను తొలగిస్తే ఆయన తరఫున తాము మాట్లాడామని గుర్తు చేశారు.
బిహార్ రాజకీయాల్లో ఇవాళ కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎమ్ఎం) బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. ఆర్జేడీ, కాంగ్రెస్.. జేఎమ్ఎం మీద రాజకీయ కుట్ర రచించాయని..
ముఖ్యమంత్రే హోంమంత్రి అయ్యుండి కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందని వ్యాఖ్యలు చేశారు.
స్థానిక అన్నాసాలైలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ విభాగం కానిస్టేబుల్పై చేయిచేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్.రాజ్కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నాసాలైలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేసిన కారును అక్కడినుంచి తరలించాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రభాకరన్ కోరగా నిరాకరించిన మైలాడుదురై ఎమ్మెల్యే రాజ్కుమార్ ఆయనపై చేయి చేసుకున్నారు.
ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్ వరుసగా మూడోసారి రఘోపూర్ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి శకుని చౌదరి కుమారుడు సమ్రాట్ చౌదరిని తారాపూర్ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది.
పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న నేతలను పక్కనపెట్టి, డబ్బున్న అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు మొగ్గుచూపినట్టు శనివారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.