Home » Congress
దండుపాళ్యం పాలన ఎవరిదో అందరికీ తెలుసని, అధికారంలేదన్న అసహనంతో కేబినెట్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ రాష్ట్ర మంతి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అంతర్గత కుమ్ములాటలు కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక, బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు? అని ప్రశ్నించారు.
తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై మహాకూటమిలో ఎలాంటి ఇబ్బందులు కనిపించనప్పటికీ సీట్ల పంకాల విషయంలో టెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 48 మంది అభ్యర్థుల జాబితాను గురువారంనాడు ప్రకటించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు నవీన్ యాదవ్. ఎన్నికల అధికారులకి మొదటి సెట్ నామినేషన్ని అందజేశారు నవీన్ యాదవ్.
బీసీల బంద్కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బిల్లును అడ్డుకునే వాళ్లు కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా వరంగల్ డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. పట్నాయక్ రిపోర్టుతోనే డీసీసీ అధ్యక్షుడిని ఏఐసీసీ గుర్తిస్తుందని చెప్పుకొచ్చారు. కొండా దంపతులకు ఓరుగల్లు ప్రజలు అండగా ఉన్నారని కొండా మురళి ఉద్ఘాటించారు.
రష్యా చమురు కొనుగోళ్ల నిలిపివేతకు మోదీ హామీ ఇచ్చారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్లో కలకలం రేపాయి. ఈ పరిణామంపై స్పందించిన రాహుల్ గాంధీ మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీకి ట్రంప్ అంటే భయమని కామెంట్ చేశారు.
నగరంలో ఆ నియోజకవర్గానికి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర దివంగత పీజేఆర్కు ఉంది. ప్రత్యర్థులను కూడా తన వాళ్లు చేసుకొని రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పీజేఆర్ వారసులు ఇప్పుడు ఆదిపత్యం కోసం పోరాడుతున్నారు.
ఆర్ఎస్ఎస్ కు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఇవి తమ కుటుంబానికి కొత్తవి కాదని, తన పోరాటాన్ని ఆపేది లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక ఐటీబీటీ శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు.
ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తన శాఖ, తన జిల్లా అభివృధి పనులపై తాను ఫోకస్ పెట్టానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.