Home » Cricket news
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీస్లో ఆసీస్పై టీమిండియా సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. జెమీమా రోడ్రిగ్స్(127*) అద్భుతమైన నాక్తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది. మ్యాచ్ అయ్యాక జెమీమా డ్రెస్సింగ్ రూంలో చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.
పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్ల జాబితాలో బాబర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు ఆ ప్లేస్ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మదే. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో బాబర్ 11 పరుగులు చేసి.. అంతర్జాతీయ టీ20ల్లో మోస్ట్ రన్స్ చేసిన బ్యాటర్గా నిలిచాడు.
భారత్తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లు విరుచుపడిన వేళ టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. తమ పరాజయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిమానులకు ఓ క్రేజీ హామీ ఇచ్చాడు. సెమీస్లో అజేయంగా సెంచరీ చేసిన జెమీమా రోడ్రిగ్స్తో కలిసి పాట పాడతానని వెల్లడించాడు. అందుకు జెమీమా అంగీకరిస్తేనే అని స్పష్టం చేశాడు.
మెల్బోర్న్లో జరుగుతున్న రెండో టీ20లో భారత టాప్ఆర్డర్ వరుసగా పెవిలియన్ బాట పట్టింది. హేజిల్వుడ్, ఎల్లిస్ సంచలనం సృష్టించగా, అభిషేక్ శర్మ మాత్రమే దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
మెల్బోర్న్కు చెందిన బెన్ అస్టిన్ టీ20 మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ట్రైనింగ్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతడి మెడకు బలంగా తగిలింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో అతడు కుప్పకూలిపోయాడు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ మృతి చెందాడు.
చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో సూర్య నుంచి పెద్ద ఇన్నింగ్స్ వచ్చిన దాఖలాలే లేవు. ఆసియా కప్లో ఓ రెండు మ్యాచ్ల్లో ఫర్వాలేదనిపించినా.. అతడి ఆటతీరు మాత్రం అది కాదు. ఈ క్రమంలో సూర్య ఫామ్పై టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య కాన్బెర్రా వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్కు దిగనుంది.
శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంగానే ఉన్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. వైద్యులు అనుకున్న దాని కంటే వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పారు. శ్రేయస్ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని.. భిన్నమైన వైద్య ప్రక్రియతో అంతర్గత రక్తస్రావం జరగకుండా వైద్యులు చూశారని తెలిపారు.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్లో స్టార్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ అందుకుంటున్న క్రమంలో అయ్యర్ ప్లీహానికి బలమైన గాయమైంది. అతడు ప్రస్తుతం సిడ్నీలోని హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు.