Home » Cricket
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ను టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మూడో వన్డే మ్యాచ్లో తమ ఓటమికి బ్యాటింగ్ కారణమని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. భారత స్నిన్నర్లు తమ పతనాన్ని శాసించారని వెల్లడించాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో సొంతం చేసుకుంది. విజయానంతరం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు. గత రెండు-మూడేళ్లుగా తాను ఇలా ఆడలేదని.. విరాట్ 3.0ని చూశారని అన్నాడు.
వైజాగ్ 3వ వన్డేలో భారత్ 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి సునాయసంగా ఛేదించింది. యశస్వి జైస్వాల్ అజేయ 116, విరాట్ కోహ్లీ 65*, రోహిత్ 75 పరుగులతో రాణించారు. భారత్ 2-1 తేడాతో వన్డే సిరీస్ను దక్కించుకుంది.
ఇండియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం...
వైజాగ్ 3వ వన్డేలో రోహిత్ శర్మ 20,000 అంతర్జాతీయ పరుగుల భారీ మైలురాయిని అందుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు. 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో హిట్మ్యాన్ భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు.
మూడో వన్డేలో కుల్దీప్ వికెట్ తీసిన వెంటనే కోహ్లీ చేసిన సరదా డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బోష్ ఔట్ అయిన తర్వాత కోహ్లీ, కుల్దీప్తో కలిసి చేసిన ఫన్నీ సెలబ్రేషన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
వైజాగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా 270 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్-ప్రసిద్ధ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. సిరీస్ గెలవాలంటే భారత్ 271 పరుగులు చేధించాలి.
వైజాగ్లో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్(106) అద్భుత సెంచరీ చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. కేవలం 24 ఇన్నింగ్స్లలో 7 సెంచరీలు చేసి సనత్ జయసూర్య రికార్డును అధిగమించాడు.
ఇండియా–సౌతాఫ్రికా వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉంది. విశాఖలో జరుగుతున్న 3వ వన్డే సిరీస్ డిసైడర్గా మారింది. ఈ మ్యాచ్లో గెలిచి ట్రోఫీ దక్కించుకోవడానికి ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.
విశాఖపట్నంలో శనివారం భారత్-దక్షిణాఫ్రికా వన్డే క్రికెట్ జరగనున్న సందర్భంగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడిక్కడే పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేశారు. స్టేడియంలోకి వెళ్లే ప్రేక్షకులను తనిఖీ చేశాకే అనుమతించనున్నారు. ఈ సందర్భంగా కొన్ని వస్తువులపై స్టేడియంలోకి నిషేధం విధిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..