Home » Crime News
ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన చిన్నారి సూసైడ్ కేసు మిస్టరీ వీడింది. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగిన ఘటనలో బాలిక ఆత్మహత్య చేసుకోలేదని.. దొంగతనానికి వచ్చిన వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. సీసీటీవీ ఫుటేజీ, మెసేజులు, వేలిముద్రల ఆధారంగా నిందితుని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడు సీన్ రీ కన్స్ట్రక్షన్ కూడా చేసినట్లు వెల్లడించారు.
ఉప్పల్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన.. శనివారం ఇంట్లో సూసైడ్ చేసుకున్నారు.
కోల్కతా ప్రాంతాల్లో తారకేశ్వర్ రైల్వే షెడ్లో బంజారా వర్గానికి బాధితురాలు తన అమ్మమ్మతో కలిసి మంచం మీద నిద్రిస్తోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి.. ఆచిన్నారిని కిడ్నాప్ చేశాడు. అనంతరం దూరంగా తీసుకెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలకూ ప్రాణాలు తీసేంత వరకూ వెళ్తున్నారు. వివాహేతర సంబంధాలకు అడ్డుపడుతున్నారని, ఫోన్ చూడొద్దు అన్నారని, ప్రియుడితో మాట్లాడొద్దు అని కండీషన్లు పెడుతున్నారంటూ కోపాలు పెంచుకుని చివరకు ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది.
తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని, డ్రగ్స్ ఓవర్ డోస్తో మృతి చెందిన మహ్మద్ అహ్మద్(26) తండ్రి మహ్మద్ మియా రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాతబస్తీ జహనుమాకు చెందిన మహ్మద్ అహ్మద్ రాజేంద్రనగర్ సర్కిల్ భవానీ కాలనీలోని కెన్వర్త్ అపార్ట్మెంట్స్లో రెండు నెలలుగా అద్దెకుంటున్నాడు.
అయ్యో.. మా అత్త మంటల్లో కాలిపోతోంది.. ఎవరైనా వచ్చి కాపాడండి.. అంటూ రోదిస్తున్న కోడలిని చూసి అంతా పరుగుపరుగున వచ్చారు. అయితే అప్పటికే ఆమె అత్త మంటల్లో కాలి చనిపోయింది. అంతా ఇది అగ్నిప్రమాదం అనే అనుకున్నారు. కానీ చివరకు కోడలి దొంగా పోలీస్ ఆట గురించి తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తిరుపతి లో గురువారం అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం చేసింది. సింగాలగుంటలో దాదాపు ఐదారు గంటల పాటు ఆరుగురు యువకులు, విద్యార్థులు హల్చల్ చేశారు. కనకభూషణ లేఅవుట్లో ఆరు కార్లు అద్దాలు ధ్వంసం చేశారు. పక్కనే వున్న విద్యుత్ శాఖ సబ్స్టేషన్ కార్యాలయ కిటికీ అద్దాలు, తలుపులు ధ్వంసం చేశారు.
హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఓ 17 ఏళ్ల బాలికను అదే కళాశాలలో సీనియర్గా చదువుకుంటున్న యువకుడు ప్రేమ పేరుతో తల్లిని చేశాడు. ఆ బాలిక గురువారం ఆసుపత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కడపలోని వసతి గృహంలో ఉంటూ కాలేజీకి వెళ్లి తిరిగి హాస్టల్కు వస్తుండేది.
మండలంలోని గొళ్లపల్లి పంచాయతీ పరిధిలోని గుడిసివారిపల్లి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం కలకలం రేపింది. అవివాహితుడైన యువకుడిని విచక్షణారహితంగా తలపై కొట్టి చంపి పడేసినట్లు తెలియడంతో గొళ్లపల్లి చుట్టుపక్కల జనం ఉలిక్కిపడ్డారు.
హైదరాబాద్లో భారీగా హ్యాష్ ఆయిల్ పట్టుబడింది. మియాపూర్ అల్విన్ కాలనీ వద్ద హ్యాష్ ఆయిల్ను విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుపడ్డ వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన 1.6 కేజీల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.