Home » Cyber attack
‘మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది’ అంటూ సైబర్ నేరగాళ్లు సీబీఐ అధికారుల పేరిట బెదిరించి ఓ వృద్ధుడి నుంచి రూ.35.74 లక్షలు కాజేశారు. ఆ తర్వాత ‘మీపై అభియోగాలు రుజువు కాలేదు. మీ డబ్బును సమీప సైబర్ క్రైంపోలీస్ స్టేషన్కు వెళ్లి తీసుకోవాల’ని సూచించడం కొసమెరుపు.
158 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ బ్రిటన్ ట్రాన్స్పోర్టు కంపెనీ సైబర్ దాడికి బలైపోయింది. డాటా మొత్తం పోవడంతో మరో దారి లేక కంపెనీని మూసివేయాల్సి వచ్చింది. ఫలితంగా 700 మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.
ఇన్కం టాక్స్ పేయర్లను టార్గెట్ చేసిన కొన్ని సైబర్ ముఠాలు, ఐటీ రిటర్న్ పేరుతో ఫిషింగ్ మొయిల్స్ను పంపి మోసాలకు తెగబడుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి సూచిస్తున్నారు. ఐటీ రిటర్న్ అంటూ లింక్తో కూడిన మెయిల్ వస్తే అది కచ్చితంగా మోసమని గుర్తించాలన్నారు.
ప్రస్తుత కాలంలో డిజిటల్ ప్రపంచం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజలు అనేక పనుల కోసం నెట్ ఉపయోగిస్తున్నారు, అదే సమయంలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పలు యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర సూచించింది.
రెండు నకిలీ ట్రేడింగ్ యాప్లతో మోసం చేసి, నగరానికి చెందిన వృద్ధుడి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ.86 లక్షలు కొట్టేశారు. నగరంలోని యూసఫ్గూడలో నివసిస్తున్న 64 ఏళ్ల బాధితుడు ఏప్రిల్, మే నెలల్లో ట్రేడింగ్ నుంచి అధిక రాబడి వస్తుందన్న సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి రెండు వేర్వేరు యాప్లలో దశల వారీగా రూ.86 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాడు.
సైబర్ నేరగాళ్లు విసురుతున్న సవాల్ను ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఏపీకే ఫైల్స్ పంపిన నేరగాళ్లు మొబైల్ను హ్యాక్ చేసి వృద్ధుడి ఖాతా నుంచి రూ.1.43 లక్షలు కొల్లగొట్టారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. ఆసిఫ్నగర్కు చెందిన 56 ఏళ్ల వృద్ధుడు తన వాచ్మన్కు సూపర్ మనీ యాప్ ద్వారా రూ.1200 పంపారు. ఆ డబ్బు అతడికి అందలేదు.
ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఆర్జించవచ్చని ఓ వృద్ధురాలిని నమ్మించి రూ.57.43లక్షలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
స్టాక్ బ్రోకింగ్ పేరిట మహిళా వ్యాపారిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. హైదరాబాద్లోని గాంధీనగర్ ఎస్బీఐ కాలనీకి చెందిన మహిళ వ్యాపారిని బురిడీ కొట్టించారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
కతార్లో ఉంటున్న మీ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారని, వెంటనే డబ్బు పంపాలని ఓ మహిళను భయపెట్టిన సైబర్ నేరగాడు ఆమె నుంచి రూ. 2లక్షలు కాజేశాడు. మెహిదీపట్నం ప్రాంతం లో ఉంటున్న మహిళ (38) సోదరుడు కతార్లో ఉద్యోగం చేస్తున్నాడు.