Home » Deputy CM Pawan Kalyan
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు చేస్తున్నారు.
తెలుగు సినిమా రక్షణలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ చర్యలు కీలకమైనవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులకు ఘర్ వాపసీ అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. వారికోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని చెప్పుకొచ్చారు.
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక ప్రత్యేక టాస్క్ ఫోర్సుకు జీవం పోసినట్లు పవన్ తెలిపారు. ఎర్రచందనం ద్వారా వచ్చే ఆదాయంలో నిర్దేశిత శాతం వాటి వనాల అభివృద్ధి, సంరక్షణకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్న ప్రజలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల వాహనాన్ని అప్పినపల్లి గ్రామస్తులు వెంబడించి మరీ పట్టుకున్నారు.
చిన్నారులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులు బాగా చదవుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.
కుప్పం నియోజకవర్గంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగుల దాడిలో మరణించాడు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ స్పందిస్తూ.. కిట్టయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ఏనుగుల సంచారంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని.. ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూని అప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని తెలిపారు. తిరుపతి లడ్డూని ఇలా అందజేయడం వల్ల హిందువుల సమష్టి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఉద్ఘాటించారు.
ఏపీలో జరుగనున్న అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఏపీ సచివాలయంలో మొంథా తుపాను నష్టం, అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధిపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.