Home » DMK
కొత్తగా రాజకీయాల్లోకి ఎవరొచ్చినా ప్రజలకు తాము చేయబోయే సత్కార్యాలను గురించి చెప్పకుండా డీఎంకేని అదే పనిగా తిట్టడమే ఆనవాయితీగా మారిందని ఎంపీ కనిమొళి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి సందర్భంగా కన్నియాకుమారి రౌండ్ఠాణా జంక్షన్ వద్దనున్న విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.
స్టాలిన్ అంటేనే ‘మేన్ ఆఫ్ స్టీల్’ అనేలా తాను తీసుకునే నిర్ణయాలన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే విధంగానే ఉంటాయని, అంతే కాకుండా కార్యసాధనలో తనకు పట్టుదల ఎక్కువేనని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకూ ‘విశ్రాంతి’ అనే మాట మరిచి, పార్టీ కోసం ముమ్మరంగా ప్రచారం చేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని జిల్లా కార్యదర్శులకు డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు.
అంబులెన్స్లు వెళ్లే ప్రధాన రహదారులను ఆక్రమించి రోడ్షోలు చేస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే ఆ పార్టీ ఐసీయూలో చేరటం ఖాయమని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) జోస్యం చెప్పారు. సైదాపేటలో రూ.28.75 కోట్లతో నిర్మించిన ఆరంతస్థుల ఆస్పత్రిని సోమవారం ఆయన ప్రారంభించారు.
విద్వేష ప్రసంగాలతో సమాజంలోని మైనారిటీ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Dy CM Udayanidhi) ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిప్లికేన్లోని కలైవానర్ అరంగంలో రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
బిహార్ తరహాలో రాష్ట్రంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - సర్) పేరుతో ఓట్ల చోరీకి పాల్పడే అవకాశాలు ఉన్నాయని, ఈ విషయంలో పార్టీ శ్రేణులు, ప్రత్యేకించి పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలు అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు.
ఆంధ్రాలో భారీ జన సమీకరణ చేసి పార్టీ ప్రారంభించిన నటుడు చిరంజీవి, ఆ పార్టీని రద్దు చేశారు, కానీ, ఈపీఎస్ ఎవరో కూడా తెలియదు అన్న నటుడు విజయ్ రాజకీయాల్లో ఏమి సాధిస్తారని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఎద్దేవా చేశారు.
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఫాసిస్టు బీజేపీని, పాయిజన్ డీఎంకేని చిత్తుగా ఓడించడమే తమిళగ వెట్రికళగం (టీవీకే) ప్రధాన కర్తవ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ శపథం చేశారు. మదురై సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన పార్టీ ద్వితీయ మహానాడులో ఆయన ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. తమ పార్టీకి సైద్ధాంతికి శత్రువు బీజేపీ అని, రాజకీయ శత్రువు డీఎంకే అని ప్రకటించారు.
రాజకీయాల్లో అంతగా అనుభవంలేని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ ఉన్నపళంగా అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారని, ప్రజల అండదండలు లేకుండా ఇది ఎప్పటికీ నెరవేరదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు.
తమ సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని, ఏకైక రాజకీయ శత్రువు డీఎంకే అని ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ ప్రకటించారు