Home » DMK
వచ్చే యేడాది జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కొత్త పొత్తులు పొడిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అన్ని పార్టీల కంటే ముందుగా అన్నాడీఎంకే జాతీయపార్టీ బీజేపీతో అత్యవసరం పొత్తును ఖరారు చేసుకోవడం రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి.
తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీయే ప్రకటించడంతో, అదే తమిళనాడు నుంచి డీఎంకే అభ్యర్థిని దించడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టాలని 'ఇండియా' కూటమి భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత, ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలను మెరుగుపరచుకునే వ్యూహాన్ని బీజేపీ అనుసరించిందనే చెప్పాలి.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష అన్నాడీఎంకేకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణుడు మైత్రేయన్ డీఎంకేలో చేరారు.
తమ పార్టీలో పదవులు అనుభవించి, అవసరం తీరాక డీఎంకేలో చేరేవారంతా వలసపక్షులేనని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’అనే నినాదంతో గత నెల 7వ తేదీ కోవై జిల్లా మేట్టుపాళయంలో ప్రారంభిమైన ఈపీఎస్ ప్రచారయాత్ర బుధవారం తిరుపత్తూరుకు చేరుకుంది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిషికేషన్ వెలువడక ముందే ఓటర్ల జాబితాను ఎలాంటి అవకతవకలు లేకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా సవరించాలే తప్ప, బిహార్ తరహా సవరణ చేయకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం డిమాండ్ చేసింది.
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి తుడిచిపెట్టుకుపోతుందన్న భయంతో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ నోరు తిరగని పేర్లతో కొత్త పథకాలను ప్రారంభిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ధ్వజమెత్తారు.
కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిని అసెంబ్లీ స్పీకర్ అప్పావు తప్పుబట్టారు. పూర్తి అధికారం పార్లమెంట్కే ఉందని ఎన్నికల సంఘానికి లేదన్నారు. ఆయన తిరునెల్వేలిలో మీడియాతో మాట్లాడుతూ, ఒక వ్యక్తి ఆరోపణలు చేస్తే, అది అబద్ధమని నిరూపించకుండానే ఆ వ్యక్తిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం తప్పన్నారు.
పదేళ్ల అన్నాడీఎంకే పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అథఃపాతాళానికి చేరిందని, గత నాలుగేళ్ల డీఎంకే ద్రావిడ తరహా పాలనలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి పురోగమించినట్లు కేంద్రప్రభుత్వమే ప్రకటించిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి స్టాలిన్ గురించి తమకు బాగా తెలుసని అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఎద్దేవా చేశారు. డీఎంకే పాలనలో అన్ని రంగాల్లో కుంటుపడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని ప్రకటించారు.