Home » Education
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణ అద్భుతాన్ని వీక్షించే క్షణం ఆసన్నమైంది. ఏకంగా 82 నిమిషాల పాటు ఆకాశంలో రక్తవర్ణంలో మెరిసిపోయే చంద్రుడి సోయగాలు కనువిందు చేయనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తప్పక పరిశీలించాల్సిన విషయాలు ఇవే అంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు..
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026) పరీక్షకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.
ఐబీపీఎస్ మరోమారు భారీ నోటిఫికేషన్ వదిలింది. ఈసారి గ్రామీణ బ్యాంకింగ్ పోస్టులకు. ప్రాంతీయ బ్యాంకుల్లో పీవో, క్లర్క్ సహా అనేక పోస్టులకు రిక్రూట్మెంట్ను విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో కొలువు కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశమనే చెప్పాలి. మరిన్ని వివరాల కోసం..
'ఎడ్యుకేట్ గర్ల్స్' ఎన్జీఓ రామన్ మెగసెసే అవార్డు 2025 గెలుచుకుంది. ఈ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయ సంస్థ. 2007లో సఫీనా హుసైన్ స్థాపించిన ఎడ్యుకేట్ గర్ల్స్, రాజస్థాన్లో ప్రారంభమై గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలకు వెళ్లని బాలికలను విద్యా వైపు నడిపించే లక్ష్యంతో పనిచేస్తోంది.
చదువుకోవడం ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కు. కానీ, కార్పొరేట్ విద్యాసంస్థలు ఈ హక్కును పూర్తిగా కాలరాస్తున్నాయి. ఫీజుల పేరిట తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చిపిప్పిచేస్తున్నాయి. అందుకు నిదర్శనంగా మరో ఉదంతం బయటకు వచ్చింది. చదువు'కొనిపించడమే' ధ్యేయంగా ముందుకెళ్తు్న్న ఓ విద్యాసంస్థ దోపిడీపై బెంగళూరు వ్యక్తి చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
నిరుద్యోగులకు అలర్ట్.. భారతీయ రైల్వే ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పారామెడికల్ స్టాఫ్ వివిధ పారామెడికల్ కేటగిరీల పోస్టుల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
IBPS 10,277 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా దరఖాస్తు గడువు తేదీని పొడిగించింది. గ్రాడ్యుయేట్ పూర్తయిన అభ్యర్థులు ఇంకా అప్లై చేసుకోకపోతే కింద ఇచ్చిన లింక్ ఆధారంగా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇదే లాస్ట్ ఛాన్స్..
ప్రధాని మోదీ బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయడం కుదరదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాన్ని ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టింది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)750 అప్రెంటిస్ పోస్టులకు నియామకాలు చేపడుతోంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ రోజే (ఆగస్టు 25) లాస్ట్ ఛాన్స్. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి వెంటనే అప్లై చేసుకోండి.
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మరో ఛాన్స్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 500 జనరల్ ఆఫీసర్ (స్కేల్ II) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలు చేసింది. జీతం నెలకు రూ.90 వేలపైనే. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.