Home » Election Commission
కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని ఈసీ పేర్కొంటూ ఇందుకు ఆధారాలు ఉన్నాయా అని ఆయనను ప్రశ్నించింది. జాతీయ భద్రతకు, ప్రజాసామరస్యానికి భంగం కలిగించే ఆకతాయి స్టేట్మెంట్లు విషయంలో మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తూ తీర్పులు వెలువడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసింది.
రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేధ(ఏఐ)ను విరివిగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం(ఈసీ) అప్రమత్తమైంది. ఏఐ సాయంతో రూపొందించిన ఫొటోలు, వీడియోలు, ఆడియో వంటివి ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయని గుర్తించింది.
నకిలీ ఓట్లు సృష్టించేందుకు బీజేపీ కొత్త మార్గం ఎంచుకుందని సీఈసీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతల తమ ఇంటి అడ్రెస్సులతో నకిలీ ఓట్లు సృష్టించుకుంటున్నారని అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను రాజీవ్ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత మీ ప్లాన్స్ ఏమిటని మీడియా అడిగినప్పుడు... మీ అందరికీ దూరంగా హిమాలయాల్లోని సుదూర ప్రాంతాలకు వెళ్లి నాలుగైదు నెలలు ఉంటానన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో మేమున్నామంటూ కాంగ్రెస్ సైతం ఆప్, బీజేపీని టార్గెట్ చేస్తోంది. ఢిల్లీ ఓటరు ఎవరివైపు ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది.
అప్డేట్ చేసిన జాబితా ప్రకారం దేశ రాజధానిలో 1,55,24,858 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 84,49,645 మంది పురుష ఓటర్లు, 71,73,952 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మార్పు చేస్తూ ఎన్నికల కమిషన్ ఇటీవల చేసిన సవరణలను కాంగ్రెస్ ఆ పిటిషన్లో సవాలు చేసింది. ఇందువల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలగవచ్చని పేర్కొంది.
ఎన్నికల సంఘాన్ని నిర్వీర్వం చేసేందుకు గతంలో ఎన్నికల కమిషనర్లను నియమించే ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని కేంద్రం తొలగించిందని, ఇప్పుడు ఎలక్ట్రానిక్ సమాచారానికి అడ్డుకోడ కట్టారని ఖర్గే అన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈసీ తాజా ఆహ్వానం పంపింది. నేరుగా తమను కలవాలని, అనుమానాలను నివృత్తి చేస్తామని తెలిపింది.
మహారాష్ట్రలో ఇటీవల శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే బ్యాగులను ఈసీ అధికారులు పదేపదే తనిఖీ చేయడం, ఇందుకు సబంధించిన వీడియోను థాకరే విడుదల చేయడంతో వివాదం మొదలైంది. ప్రధానమంత్రి, బీజేపీ నేతలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇదే తరహా తనిఖీలు చేస్తారా అని థాకరే నిలదీశారు.