Home » Elections
ఏబీవీపీ కీలకమైన మూడు పోస్టులు సొంత చేసుకుంది. అధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను కైవసం చేసుకుంది. ఎన్ఎస్యూఐకి ఒక్క వైస్ ప్రెసిడెంట్ పదవి మాత్రమే తక్కింది.
బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్కు సుప్రీంకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువుపై ఉన్నత న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు బీసీ రిజర్వేషన్ విషయంలో వేచి చూస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
ఢిల్లీ యూనర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు ఈనెల 18వ తేదీ గురువారంనాడు జరుగనుండగా, ఫలితాలు శుక్రవారంనాడు వెలువడతాయి. డే క్లాసెస్ వారికి ఓటింగ్ ప్రక్రియ ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవెనింగ్ క్లాసెస్ వారికి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓటింగ్ ఉంటుంది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఈ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇందుకోసం కీలక నేతలతో కూడా కవిత సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. జూబ్లీహిల్స్లో తెలుగుదేశం పార్టీ పోటీపై తెలంగాణ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయాలని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
వివిధ కారణాల రీత్యా ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి. నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతా దళ్కు చెందిన ఏడుగురు రాజ్యసభ్యులు, కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరామ్ రమేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ వీల్చైర్పై పార్లమెంటుకు వచ్చి ఓటు వేశారు.
బిజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి ముఖాముఖీ తలబడుతున్నారు. కాగా, వివిధ కారణాలతో తాము ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్కు దూరంగా ఉంటున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి.
ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖీ పోటీ నెలకొంది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో 17వ ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.
పార్టీ విప్లు లేకుండా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఉప రాష్ట్రపతి పదవికి ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఎన్డీయే, 'ఇండియా' కూటమి నేతలు క్రాస్ ఓటింగ్ జరగవచ్చని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.