Home » Elections
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమి అభ్యర్థిగా బి.సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్నారు.
ఉపరాష్ట్ర పతి ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. కొన్ని గంటల్లో ఎంపీలు తమ ఓటు హక్కుని వినియోగించుకుని ఉప రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. రాత్రికి ఫలితాలు బయటకు వస్తాయి.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు జగ్దీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖీ పోరు నెలకొంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. రాజ్యసభ, లోక్సభ సభ్యులు ఈ ఓటింగ్లో పాల్గొంటారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషన్కు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లేఖ రాసింది.
దర్భంగా జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని బీజేపీ నాయకుడు కృష్ణ సింగ్ కల్లు ఆరోపించారు. ప్రపంచంలో లేని వ్యక్తి గురించి దుర్భాషలు ఆడటం బాధాకరమన్నారు.
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్పై రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ ఇవాళ(సోమవారం) సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో కొత్తగా 79 పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. గతంలో 329 ఉన్న పోలింగ్ స్టేషన్లను 408కి పెంచనున్నామని ఆర్వీ కర్ణన్ వివరించారు.
హోం మంత్రిత్వ శాఖ విచారణ ప్రకారం, ఇమ్రానా ఖానమ్ అలియాస్ ఇమ్రానా ఖాటూన్, ఫిర్దోషియా ఖానమ్లకు ఓటర్ కార్డులు జారీ అయ్యాయి. ఫిర్దోషియా 1956లో మూడు నెలల వీసాపై, ఇమ్రాన్ మూడేళ్ల వీసాపై భారత్కు వచ్చారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్పై ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ సమావేశమయ్యారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు ఎస్పీకి గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో హరిబాబు మాట్లాడారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓట్లు రిగ్గింగ్ చేశారంటూ అంబటి రాంబాబు తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోలను పోస్ట్ చేసిన అంబటిపై చర్యలు తీసుకొవాలని విజ్ఞప్తి చేశారు.