Home » Flood Victims
ఎడ తెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదలతో విజయవాడలో వరద నీరు పోటెత్తింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జల దిగ్బందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో మరణించారు. వందలాది ఇళ్లు నీటి ముంపులో ఉండిపోయాయి. వేలాది మంది పునరావాస కేంద్రాలకు తరలించారు. దీంతో సహాయక చర్యలను చంద్రబాబు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదిక చేపట్టింది.
వరదల సమయంలో సీఎం చంద్రబాబు పనితీరు అద్భుతంగా ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలనూ సమన్వయం చేసి వరద బాధితులను ఆదుకున్న తీరుపై దేశవ్యాప్తంగా సీఎంపై ప్రశంసలు కురుస్తున్నాయని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
వరద బాధితులను ఆదుకోవడం ముఖ్యమంతి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు జగన్ భరోసా ఇస్తారని అంతా ఆశించారు. కానీ కేవలం ప్రచారం కోసం మాత్రమే పిఠాపురంలో జగన్ పర్యటించారనే చర్చ సాగుతోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పర్యటిస్తే..
విజయవాడలో వరదలతో సర్వం నష్టపోయిన బాధిలందరికీ సీఎం చంద్రబాబునాయుడు సాయమం దిస్తున్నారని, ఆయన సూచనలతో తాము కూడా తమవంతు సహా యం అందిస్తున్నామని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.
విజయవాడ: నగరంలో పలు చోట్ల జరుగుతున్న వరద నీటి పంపింగ్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. కండ్రిక, జర్నలిస్టు కాలనీ, రాజీవ్ నగర్లో వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పర్యటించారు. 64 వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ సంపత్ కుమార్తో కలిసి బుడమేరులో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.
వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దాతలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, సినీనటులు, రాజకీయ నాయకులు గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలసి విరాళాల చెక్కులు అందజేశారు.
రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలను సాధారణ విపత్తుగా పరిగణించరాదని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
గోదావరి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. లంక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకు వస్తుండడంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ జిల్లా పరిధిలోని గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయల వెంబడి ఉన్న కాజ్వేలన్నీ దాదాపు మునిగిపోయాయి. వరద తీవ్రతపై జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి సమీక్షించారు.
విజయవాడ వరదబాధితుల కోసం ప్రొద్దుటూరు బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఆ సంస్థ అధ్యక్షుడు బొర్రా రామాంజనేయులు తెలిపారు. గురువారం సాయం త్రం బీసీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం లోమాట్లా డుతూ నాలుగు రోజులుగా పట్టణంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, వైద్యులు దాతలనుంచి దాదాపు మూడు లక్షల మేరకు విరాళాలు సేకరించామన్నారు.