Home » Flood Victims
Andhrapradesh: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద శాంతిస్తోంది. ఉదయం 7 గంటల నుంచి గోదావరి భారీ వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 15.30 అడుగులకు పెరిగి అర్ధరాత్రి నుంచి నిలకడగా గోదావరి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 15.10 అడుగులకు నీటిమట్టం తగ్గింది.
‘ఏలేరు వరద బాధితులకు అండగా ఉంటా. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి. ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.10వేలు సాయం చేస్తా.తక్షణం దుస్తులు పంపిణీ చేయిస్తా. పంటలు నష్టపోయిన అన్నదాతలకు హెక్టారుకు రూ.25వేల సాయం, ఎరువులు, పొటాషియం అందిస్తా. ఇళ్లు దెబ్బతిన్న వారికి ఇళ్లు కట్టిస్తా ను’ అని సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు.
ఈ సారి గోదావరి వరద తుది ప్రమాద హెచ్చరికకు చేరువగా వచ్చినా ముందస్తు చర్యలతో ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో వరద నష్టం రూ.10,300 కోట్లు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది.
విజయవాడలో వరద బాధి తులకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు.
విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
వరద బాధితులకు మదనపల్లె నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు. బుధవారం స్థానిక టౌనహాల్లో 3 వేల నిత్యావసర కిట్లు, 500 గ్యాస్ స్టౌవ్లు, ఇతర సామగిని ప్యాక్ చేసి లారీలకు లోడ్ చేశారు.
AP Deputy CM Pawan Kalyan - Telangana CM Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసానికి వచ్చిన పవన్.. ఆయనను కలిశారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు? ఆ విశేషాలేంటి? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
విజయవాడలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలుద్దామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
విజయవాడ వరద బాధితులకు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలోని మెప్మా విభాగం తరపున ఆర్థిక సాయం అందజేశారు. మెప్మా పొదుపు సంఘాల అధ్యక్షురాలు పార్వతి ఆధ్వర్యంలో మంగళవారం రూ. 1,21,200 చెక్కును ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసు లుకు అందజేశారు.