Home » Flood Victims
రాగల 72 గంటల్లో గోదావరి వరద మహోగ్ర రూపం దాల్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అన్నారు. అధికారులు సూచించే ఆదేశాలను లంక గ్రామాల ప్రజలు ఖచ్చితంగా పాటించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
గోదావరి వరద ఉగ్రరూపం దాల్చడంతో బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. గోదావరి వరద ఉధృతి కారణంగా కోనసీమలోని గౌతమి, వృద్ధగౌతమి, వశిష్ట, వైనతేయ నదీపాయల్లో ప్రవాహ వేగం పెరుగుతోంది. ఇప్పటికే ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Andhrapradesh: భారీ వర్షాలతో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో ఏలేరు వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ఉధృతికి 25 వేల ఎకరాలు నీట మునిగాయి.మూడు మండలాల్లో 23 గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది.216వ జాతీయ రహదారిపై పిఠాపురం గొల్లప్రోలు మధ్య మూడు చోట్ల ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది.
Andhrapradesh: ఏపీలో వరదలు ఎంతటి ఉపద్రవాన్ని సృష్టించాయే అందరికీ తెలిసిందే. బెజవాడ వాసులను వరదలు ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సర్వం కోల్పోయారు వరద బాధితులు. ఇప్పుడిప్పుడే వరద నుంచి విజయవాడ వాసులు కాస్త కోలుకుంటున్నారు. మరోవైపు భారీ వరదలతో అంతా కోల్పోయిన వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.
నాయకుడి యొక్క గొప్పతనం, పనితనం విపత్తులు, కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తాయి. అంతా బాగున్నప్పుడు ఎవరైనా చేయగలరు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచి.. వారి కష్టాల్లో భాగస్వామ్యం..
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం కారణంగా భారీ నష్టం వాటిల్లింది. వరద ప్రభావం క్రమంగా తగ్గుతుండటంతో జరిగిన నష్టం వెలుగు చూస్తోంది. ఏపీలో వరద నష్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారమే..
జగన్ ఐదేళ్ల పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను రాజకీయ పండితులు పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ తన పద్ధతిని మార్చుకుని.. పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఎంతోమంది సూచించారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
విజయవాడ: ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలోనూ ఆయన వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఖండ్రిక సమీపంలో నున్న - నూజివీడు రహదారి చుట్టుపక్కల ఇప్పటికీ వరద నీరు ఉంది.
ఏలేరు రిజర్వాయర్ కన్నెర్ర జేసింది. కాకినాడ జిల్లా పరిధిలోని ఏడు మండలాల్లో వరద ముంచెత్తింది. పిఠాపురం నియోజకవర్గంలో వరద ప్రభావంతో కొన్ని కాలనీలు నీటమునగగా, వేలాది ఎకరాల్లో పంట వరద పాలైంది.
కృష్ణా నది వరద పోటుపై ఉన్న సమయంలోనే ప్రకాశం బ్యారేజీని మూడు ఇనుప బోట్లు ‘కలిసికట్టు’గా ఢీకొట్టడం వెనుక భారీ కుట్ర దాగిఉందా? బ్యారేజీ గేట్లను దెబ్బతీసేందుకే... ఉద్దేశపూర్వకంగా బోట్లను అలా ‘వదిలేశారా?’ ఈ అనుమానాలను బలపరిచే అనేక అంశాలు బయటపడుతున్నాయి. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ...