Home » Gandhi Bhavan
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. నిజమైన ప్రజా సేవకుడికి అహంకారం ఉండదంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనని అంతా భావిస్తున్నారన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు గాంధీభవన్లో ఆదివారం ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్, ఎంపీ అనిల్ యాద వ్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని తొందరగా ఓవర్ టేక్ చేయాలని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డికి ఉండొచ్చు! అందుకోసం మాపై అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా? రూ.1.30 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోళ్లలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని మాట్లాడుతున్నడు.
ప్రధాని మోదీ.. అబద్ధాల కోరని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఈ పదేళ్లలో ఎన్నో హామీలను ఇచ్చిన మోదీ.. ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. శనివారం పంజాబ్ రాష్ట్రం ఫరీద్కోట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మొగ, ధరంకోట్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్ రావుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తే తప్పెంటని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబ సమేతంగా వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కలేదా అని నిలదీశారు. ఇప్పుడు ఏ హోదాలో సోనియా గాంధీని దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నారని మాట్లాడటం సరికాదని సూచించారు.
Telangana: మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్న కామెంట్స్పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి స్పందించారు. పద్మశాలిలు నిరోద్లు అమ్ముకోవాలంటూ తాను వ్యాఖ్యలు చేసినట్లుగా కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పద్మశాలిలను అనలేదనీ, ఒక వ్యక్తితో వేరే సందర్బంలో మాట్లాడిన వాటిని కట్అండ్ పేస్ట్ చేసి వైరల్ చేశారని తెలిపారు.
Telangana: కేంద్ర మంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో అంశం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు గాంధీభవన్కు చేరుకున్నారు. 91 కింద నోటీసులు ఇస్తామని గాంధీభవన్ సిబ్బందికి అధికారులు తెలిపారు.
ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ (Congress) ఎంపీ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించి పార్టీ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తు న్నామంటూ ఫోన్లు రావడంతో అభ్యర్థులు ఒక్కసారిగా టెన్షన్ పడ్డారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Dana Nagender) తాజాగా సీఎం రేవంత్రెడ్డితో పాటు పార్టీ అగ్రనేతలను కలవడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం మొదలైంది.
ఫిబ్రవరి 6న గాంధీ భవన్లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ( పీఈసీ ) సమావేశం జరగనుంది. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించనున్నారు.