Home » GHMC
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణ/కబ్జాలు, విపత్తుల నిర్వహణ సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1070ను కేటాయించింది. ఇప్పటి వరకు ప్రజావాణి, ఎక్స్ ద్వారానే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండగా.. తాజాగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ నుంచి మహా నగరానికి గోదావరి జలాలను తీసుకురావడంతో పాటు, జంట జలాశయాలను నింపి మూసీనదిలో ప్రవహింపజేసే గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టుకు క్లియరెన్స్లు చకచకా మొదలయ్యాయి.
జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ గేట్లను ఎత్తడంతో పాటు ట్యాంక్బండ్ (హుస్సేన్సాగర్) నుంచి నీటిని విడుదల చేయడంతో శుక్రవారం ఉదయం నుంచి మూసీలో వరద ఉధృతి పెరిగింది. దీంతో ముసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది.
జీహెచ్ఎంసీ పౌర సేవా కేంద్రాల్లో(సీఎస్సీ) నగదు స్వీకరణ ఆగడం లేదు. సూపర్ స్ట్రక్చర్స్ పన్ను పేరిట జరుపుతున్న నగదు చెల్లింపులు సిబ్బందికి అక్రమార్జన వనరుగా మారుతున్నాయి. చందానగర్ సర్కిల్లోని సీఎ్ససీలో బహిర్గతమైన బాగోతంతో ఇతర కేంద్రాల్లో పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది.
జీహెచ్ఎంసీలో మరో అవినీతి బాగోతం బయటపడింది. ఆన్లైన్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వచ్చినా నగదు వసూళ్లను కొందరు అక్రమార్జన వనరుగా మార్చుకున్నారు. సంస్థలోని పౌర సేవా కేంద్రాల్లో (సీఎస్సీ) వసూలైన పన్నును ఖజానాలో జమ చేయకుండా కొందరు ఉద్యోగులు నొక్కేశారు.
ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా మరోసారి కొరడా ఝుళిపించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్లోని జూబ్లీ ఎన్క్లేవ్లో ఆక్రమణలను తొలగించింది. మెటల్ చార్మినార్ నమూనాకు ఎదురుగా హైటెక్సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకొని ఉన్న 3వేల చదరపు గజాల ప్రభుత్వ స్థలం సహా మొత్తంగా 16వేల చదరపు గజాల విస్తీర్ణంలోని పార్కులు, భారీ హోటల్ షెడ్డు, రహదారులపై ఉన్న ఇతర ఆక్రమణలను గురువారం హైడ్రా బుల్డోజర్లు నేలమట్టం చేశాయి.
జలమండలిలో రెవెన్యూ పెంపునకు కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టనున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రకటించారు. జూబ్లీహిల్స్ థీమ్ పార్క్లో వాటర్ బోర్డు రెవెన్యూ, ఐటీ విభాగ అధికారులతో సమావేశం అయ్యారు. డొమెస్టిక్ కేటగిరీ కింద ఉన్న కమర్షియల్ కనెక్షన్లను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు.
భారీ వర్షాల దాటికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అవుతుంది. నిన్న రాత్రి కురుసిన వర్షానికి నగరమంతా జలమయం అయిపోయింది. రోడ్లు చెరువులను తలిపిస్తున్నాయి
వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ చేపట్టిన దత్తత కార్యక్రమానికి హైదరాబాద్ వాసుల నుంచి మంచి స్పందన వచ్చింది.
సమాజంలో ఇన్నాళ్లూ వివక్షకు గురైన వారికి ఇప్పుడు చేయూత లభిస్తోంది. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. స్వయం ఉపాధి పొందేందుకు వారిలో ఇంకొందరు సిద్ధమవుతున్నారు.