Home » Godavari
గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. శనివారం సాయంత్రం 5 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 8.50 అడుగులుగా ఉంది. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 5,81,417 క్యూసెక్కులు ప్రవాహం వెళుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి పాండ్ లెవల్ 13.26 మీటర్లుగా ఉంది.
కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండటంతో.. వాటి కింద ఉన్న ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజులుగా ఎగువ నుంచి కృష్ణమ్మకు భారీగా వరద వస్తుండటంతో జలాశయాలన్నీ నిండు కుండలా మారాయి.
నదుల అనుసంధాన ప్రక్రియ మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రంలో మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ గోదావరి - కావేరి నదుల అనుసంధానంపై దృష్టి సారించారు. ఈ సంధానం రాష్ట్రానికి మేలు చేసేలా...
కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 8 గేట్ల ద్వారా 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు సగానికి పైగా నిండింది.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.40 అడుగుల వద్ద 14,45,047 క్యూసెక్కుల వరద ప్రవాహిస్తుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రహదారులపై వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకుంది.
గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. శనివారం సాయంత్రం 4.16 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరుకోవడంతో ఆర్డీవో దామోదర్రావు మూడో(తుది) ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. గోదావరి వరదలపై భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు.
గోదావరి వరద తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గురువారం ఉదయం 9 గంటలకు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం ఆరు గంటలకు నీటిమట్టం 13.40 అడుగులు ఉంది. బ్యారేజీ గుండా 12,30,242
భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. 51.10 అడుగుల వద్ద 13,18,860 క్యూసెక్కుల వరద ఉధృతి పెరిగింది. 53 అడుగులు దాటగానే మూడో ప్రమాద హెచ్చరిక జారీ కానుంది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నది ప్రవాహం 50.6 అడుగులకు చేరడంతో సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మేడిగడ్డ వద్ద ఏకంగా 9 మీటర్ల ఎత్తున ప్రవాహం కొనసాగుతోంది. మరోవైపు కృష్ణా బేసిన్లోని శ్రీశైలానికి భారీ వరద వస్తోంది.