Home » Godavari
సీజన్ మొదలై నెలన్నర దాటినా.. మొన్నటివరకు వానలు పెద్దగా లేనే లేవు..! ఈ ఏడాది వర్షాభావం తప్పదా? అన్న ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో వరుణుడు కరుణిస్తున్నాడు..! తెలంగాణలోనే కాక.. ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో కృష్ణమ్మ బిరబిరా తరలివస్తోంది.
గోదావరి వరద ఉధృతమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా పరుగులు పెడుతోంది.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ(Dowleswaram Barrage) ఒకటో నంబర్ గేటు వద్ద ప్రవాహానికి అడ్డంగా నాటుపడవ ఇరుక్కుపోయింది. దీన్ని బయటకు తీసేందుకు 24 గంటలుగా అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి.
గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద స్వల్పంగా పెరిగి 10.90 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 175 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలారు.
గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను మత్స్యకారులు రక్షించారు. కోవ్వూరు - రాజమండ్రి బ్రిడ్జ్పై నుంచి మహిళ నదిలో దూకుతుండగా రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
కాశీ పుణ్యక్షేత్రంలో నిరంతరాయంగా జరుగుతున్న గంగా హారతి మాదిరిగా గోదావరి పరివాహక ప్రాంతంలో వెలసిన బాసర(Basara) పుణ్యక్షేత్రంలో నిత్య గంగా (గోదావరి) హారతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ వేద భారతీ పీఠం పండితుడు, అధ్యాపకుడు గురుచరణ్ తెలిపారు.
పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ కళొచ్చింది. టీడీపీ అఽధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో గోదావరిపై నిర్మించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అంచనాలు రెట్టింపయ్యాయి.
గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టు ముసాయిదా డీపీఆర్పై రాష్ట్రాలకు విధించిన గడువుపై విమర్శలు రావడంతో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) వెనక్కి తగ్గింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని(Kaleswar Project) మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుకు గల కారణాలను అన్వేషిండానికి వీలుగా బ్యారేజీ దిగువ భాగంలోనూ సాంకేతిక పరీక్షలు(Technical Tests) నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బ్యారేజీల్లోని అన్ని బ్లాకుల్లో..
ఉమ్మడి గోదావరి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర ఆయన పార్టీ శ్రేణులకు సైతం నిరాశనే మిగిల్చింది. జగన్ వస్తున్నారంటూ వైసీపీ నాయకులు గురువారం మధ్యాహ్నం నుంచే పలు కూడళ్లకు మహిళలను ఆటోల్లో తరలించారు. అయితే జగన్