Home » Guntur
ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్ఘాటించారు. ఆటో డ్రైవర్ ఒక కుటుంబాన్ని ఏ విధంగా సురక్షితంగా ఇంటికి చేరుస్తారో.. అలాగే సీఎం చంద్రబాబు ఏపీని కూడా సురక్షితంగా ఉంచుతున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.
ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన యజమాని శేఖర్ పోలీసులను ఆశ్రయించారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో నాగార్జున యాదవ్పై ఫిర్యాదు చేశారు.
కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో మరో భారీ చోరీ జరిగింది. మోటూరు మధుసూదనరావు ఇంట్లోకి చొరబడ్డ దుండగులు బీరువా తలాలు పగలగొట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. 10 లక్షలు విలువ చేసే ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.
కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో వారి విడుదల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో వారు విడుదలై స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు.
పెద్దల నిర్ణయం కారణంగా విడిపోయి బతకటం కష్టమని భావించారు ఓ ప్రేమజంట. విడిపోయి బతకటం కంటే కలిసి చావటం మేలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే దారుణమైన నిర్ణయం తీసుకున్నారు.
గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి వచ్చిన మరొకరికి కలరా సోకినట్లు గుర్తించారు. కలరా ఉధృతితో వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా 114 మంది అనారోగ్యంతో అసుపత్రిలో చేరారు. వీరికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. నాలుగు కలరా కేసులు నమోదు అవగా.. ఈకోలీ బ్యాక్టరీయా కేసులు 16క నమోదు అయ్యాయి.
ప్రయాణికులు తిరుపతి నుంచి పిఠాపురం దేవాలయంలో పూర్వికులకు పిండ ప్రధానం చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతిచెందిన ముగ్గురు ఓకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్ర సారస్వత పరిషత్తు 'తెలుగు వికాసం' పేరిట గుంటూరులో నిర్వహించిన లఘు చలన చిత్ర పోటీలలో 'పెద్ద బాల శిక్ష'కు ప్రధమ బహుమతి దక్కింది, 'ఉనికి' , 'తెలుగు వైభవం' చిత్రాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు దక్కాయి.
కూటమి ప్రభుత్వ హయాంలో హాస్టల్స్లో చదువుకునే విద్యార్థులకు మంచి భోజన సదుపాయం అందిస్తున్నట్లు మంత్రి డోలా స్పష్టం చేశారు. పీ-4 ద్వారా పేదరికంలో ఉన్న వారికి ఆర్థికంగా తోడ్పాటు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు.