Home » Harish Rao
సీఎం రేవంత్ అజ్ఞానిలా మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ ఆరోపించారు. రాజకీయ నాయకుల సూచనలు పాటిస్తే ఊచలు లెక్కపెడతారని ఇంజినీర్లను హెచ్చరించడం ఏంటని నిలదీశారు.
బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు కేటీఆర్కు అప్పగిస్తే స్వాగతిస్తానని హరీశ్ రావు అన్నారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పంచాయితీ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. పార్టీ మారుతానని.. జరుగుతోన్న చిల్లర ప్రచారాన్ని బంద్ చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఎప్సెట్-2025 ఫలితాలను సీఎం రేవంత్రెడ్డి తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి విడుదల చేయడం అహంభావానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
Harish Support To Soldiers: సరిహద్దులు అంటే భౌగోళికంగానే కాదు ఈ దేశ ప్రజల భద్రత, దేశ భవిష్యత్తు కూడా అని... దానిని నిలబెట్టడానికి సైనికులు పోరాడుతున్నారని హరీష్ రావు తెలిపారు. పాకిస్థాన్..భారత దేశం నుంచి విడిపోయినప్పటికీ మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతుల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని, సీఎంకు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
BRS leader Harish Rao: సిద్ధిపేట మార్కెట్ యార్డ్లో వంద లారీలు ధాన్యం తడిసిపోయి ఉందని, వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు వదులుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పటికే ఐదుగురు రైతులు ధాన్యపు కుప్పల మీదనే ప్రాణాలు వదిలారని.. ఇవి సాధారణ మరణాలు కావని, ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలోని కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల పరిధిలో ఏప్రిల్లో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను నేటికీ చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థతేనని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.
కట్టెల లోడ్తో వెళ్తున్న ఓ లారీ రెండు కార్లపై బోల్తా పడడంతో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఉపాధి హామీ పథకం కోసం గత ఏడాదిలో 12.22 కోట్ల పనిదినాలు మంజూరు చేయగా ఈసారి కేవలం 6.5 కోట్లకే పరిమితం చేయడం సరికాదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.