Home » Harish Rao
Telangana: జిల్లాలోని ఆర్సీపురంలో బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో సమావేశం నిర్వహించగా.. భారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఈ సంద్భంగా హరీష్రావు మాట్లాడుతూ...వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారని...పార్టీ అయిపోయింది అన్నారని.. కానీ అన్నవాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరి రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన కాలయాపన వల్ల 8 నెలలుగా రైతు రుణాలపై పడిన వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించాలని అన్నారు.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను ప్రత్యేకంగా కలిశారు. అధికారం కోల్పోయాక.. ప్రతిపక్ష హోదాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా స్పీకర్ను కలవడం ఇదే మొదటిసారి.
రుణమాఫీ పథకం అమలుకు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వడపోతలపైనే దృష్టి పెట్టినట్లు కనబడుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసే విధంగా కొత్త సంస్కృతిని తీసుకొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు వారి డిమాండ్ల సాధన కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే.. కనీసం స్పందించకపోగా.. ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రజల మనిషి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎ్సలో ఉన్న ఏకైక మంచి వ్యక్తి, వివాదరహితుడు హరీశ్రావు మాత్రమేనని ప్రశంసించారు.
సిద్దిపేట జిల్లా: ఆషాడ బోనాల సందర్భంగా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామన్న ప్రభుత్వ మాట ఆచరణకు నోచుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ మరింత బలహీనపడుతూ వస్తోంది. గతంలో కేసీఆర్ను హీరో అంటూ ప్రశంసించిన వాళ్లే.. అధికారం పోయే సరికి.. కేసీఆర్ జీరో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.