Home » Harish Rao
వర్షాలు, వరద ముంపు వల్ల నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
డెంగ్యూ జ్వరంతో చనిపోయిన తిమ్మాపూర్ యువకుల కుటుంబాలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని.. పారిశుద్ధ్యం సరిగా లేక గ్రామాలు పడకేస్తే రేవంత్ సర్కార్ మొద్దునిద్రపోతోందని మండిపడ్డారు.
యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రైతుల కష్టాలను రాజకీయం చేయడం సిగ్గు చేటని అన్నారు..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి వరదలై పారిందని ఘోష్ కమిషన్ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీనంతటికీ కేసీఆర్ పూర్తి బాధ్యుడని సూటిగా చెప్పింది. బ్యారేజీల కుంగుబాటు వ్యవహారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగింది కాబట్టే ఆ ప్రాజెక్టు మాటున సాగిన దారుణాలు బయటికి వచ్చాయి.
కేసీఆర్ గోదావరి జలాలతో రైతుల పాదాలు కడిగితే, రేవంత్రెడ్డి యూరియా కోసం రైతులతో పోలీసుల కాళ్లు మొక్కిస్తున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.
Harish Rao Comments: రైతులకు కంటి నిండా నిద్ర పట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అగ్ర తాంబూలం ఇస్తే రేవంత్ ప్రభుత్వం అద:పాతాళానికి తొక్కుతోందని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై ఇవాళ(బుధవారం) విచారణ జరిగే అవకాశం ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాస్ చేస్తూ.. కేసీఆర్, హరీష్ రావులు రెండు పిటిషన్లు ధాఖలు చేశారు. కాళేశ్వరం నివేదికలో సూత్రధారులుగా ఇరువురి పేర్లను ఘోస్ కమిషన్ ప్రస్తావించిన విషయం తెలిసిందే.
కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్లక్ష్యం, అక్రమాలపై విచారణ కోసం వేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అక్రమమంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందనే అబద్ధపు ప్రచారాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. గోదావరిలో వరద జలాలను ఒడిసిపట్టకుండా, వృధాగా సముద్రంలోకి వదిలేస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మేడిగడ్డ కూలిందని హరీష్ రావుకు గుర్తు లేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయవద్దని చేప్పిందని పేర్కొన్నారు.