Home » Hema
హైదరాబాద్: తెలుగు నటి హేమకు డ్రగ్స్ కేసులో ఊరట లభించింది. బెంగుళూరు హైకోర్టు ఆమెకు స్టే ఇచ్చింది. గత ఏడాది మే నెలలో బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన అనంతరం నటి హేమపై నమోదైన డ్రగ్స్ కేసులో ఆమెపై తదుపరి చర్యలపై హైకోర్టు స్టే విధించింది.
నటి హేమ(Actress Hema)పై మా అసోసియేషన్ బ్యాన్ ఎత్తేసింది. బెంగళూరు రేవ్ పార్టీ(Bengaluru Rave Party) వ్యవహారంలో హేమపై మా కమిటీ గతంలో బ్యాన్ విధించింది.
రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (‘మా’) కమిటీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఆమె దోషిగా తేలితే చర్యలు తప్పవని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల పేర్కొన్నారు. అందులో భాగంగా ఆయన కమిటీ సభ్యులు అభిప్రాయాలను కోరినట్లు తెలిసింది.
సంచలనం సృష్టించిన రేవ్పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బెంగళూరు ఎలకా్ట్రనిక్ సిటీలోని జీఆర్ ఫాంహౌ్సలో జరిగిన ఈ రేవ్పార్టీపై దాడి చేసిన రోజే పోలీసులు ఐదుగురు మాదక ద్రవ్యాల వ్యాపారులు, పార్టీ నిర్వాహకులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సోమవారం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్కు వచ్చిన బెంగళూరు సీసీబీ పోలీసులు హేమను అదుపులోనికి తీసుకోవడం జరిగింది..
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ ప్రముఖ నటి హేమ అడ్డంగా బుక్ అయ్యారు. ఈ కేసులో తమ విచారణకు హాజరుకావాలని ఆమెకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
బెంగుళూరు డ్రగ్స్ కేస్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. విచారణ కు హాజరయ్యేందుకు సమయం కావాలని హేమ కోరినట్టుగా తెలుస్తోంది. తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని బెంగుళూరు సీసీబీకి హేమ లేఖ రాసింది. హేమ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకుంది. హేమకు మరో నోటీస్ ఇచ్చేందుకు బెంగుళూరు పోలీసులు సిద్ధమయ్యారు.
బెంగుళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న 8 మందికి సీసీబీ నోటీసులు జారీ చేసింది. నేడు బెంగళూరు సీసీబీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇవాళ నటి హేమ సహా 8 మందిని సీసీబీ విచారించనుంది. విచారణకు రాని పక్షంలో కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. రేవ్ పార్టీలో 101 మందిని పరీక్షించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ అయినట్టు తెలుస్తోంది.
బెంగళూరు ఫాం హౌస్లో జరిగిన రేవ్ పార్టీ కేసును విచారిస్తున్న సీసీబీ అధికారులు.. తెలుగు నటి హేమకు శనివారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రేవ్ పార్టీ వ్యవహారం బయటపడిన వెంటనే హేమ ఓ వీడియో విడుదల చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.