Home » Hero Vijay
కరూరు దుర్ఘటనకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ టీవీకే నేత విజయ్కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్న వ్యవహరానికి రాజకీయ రంగు పులమద్దని కరూరు ఎంపీ జ్యోతిమణి అన్నారు.
కరూర్ తొక్కిసలాట దుర్ఘటనను అడ్డుపెట్టుకుని ఏ రాజకీయ పార్టీ రాజకీయ లబ్ధికోసం పాకులాడొద్దని డీఎంకే మహిళా నేత, తూత్తుకుడి ఎంపీ కనిమొళి విఙ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఆమె మంగళవారం మాట్లాడుతూ, తొక్కిసలాట జరిగిన సమయంలో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
కరూర్లో టీవీకే అధినేత విజయ్ ప్రచారం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని, విద్యుత్ సరఫరాను నిలిపేశారని, ఉద్దేశపూర్వకంగా ప్రచారమార్గంలో అంబులెన్సులను నడిపారంటూ వస్తున్న విమర్శలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు సమాధానం చెప్పారు.
ఇటీవల ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ కరూర్ పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన వ్యవహారం రాష్ట్రంలో ఇంకా నిప్పు రాజేస్తూనే వుంది. ఈ దుర్ఘటన ద్వారా లబ్ధి పొందేందుకు అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతుండడంతో మరిన్ని కొత్త వివాదాలకు కారణమవుతోంది.
కరూర్ దుర్ఘటనలో అన్నివైపులా తప్పులు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు.శనివారం సాయం త్రం కరూర్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పర్యటనలో ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత విజయ్(Vijay)కి రాజకీయాలంటే ఏమిటో తెలియవని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని హాస్యనటుడు ఎస్వీ శేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం సచివాలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ మందవెళిపాక్కంలోని ఐదో క్రాస్ రోడ్డుకు రంగస్థల నటుడైన తన తండ్రి వెంకట్రామన్ పేరు పెట్టినందుకు ఈ సందర్భంగా సీఎం స్టాలిన్కు ధన్యవాదాలు తెలిపారు.
వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకే నేత, హీరో విజయ్ ప్రధాన ప్రతిపక్షనేతగా ఉంటారని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యానించారు. విరుదునగర్ జిల్లా సాత్తూరు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో రూ.50లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఇటీవల తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ర్యాలీలకు వస్తున్న జనసంద్రాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ, ఆ జనం అంతా ఓటర్లుగా మారతారా? ఇదే ప్రశ్నకు తాజాగా కమల్ హాసన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
తమిళ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ నివాసంలో గుర్తు తెలియని అగంతకుడు చొరబడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కట్టుదిట్టమైన ‘వై’ కేటగిరీ భద్రత కలిగిన విజయ్ నివాసంలో ఆ అగంతకుడు ఎలా ప్రవేశించాడన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ రోజుకు రెండు జిల్లాల్లో మాత్రమే ప్రచారం చేయనున్నారు. గతంలో విజయ్ పర్యటన కోసం తయారు చేసిన రూట్మ్యా్పలో స్వల్పమార్పులు చేపట్టినట్లు ఆ పార్టీ నిర్వాహకులు తెలిపారు.