Home » Hero Vijay
తన పర్యటనలకు జనం అధిక సంఖ్యలో రావాలనే ఆలోచనతోనే తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ వారంతపు సెలవుదినాల్లో ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి విమర్శించారు.
‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నాయకుడు, ప్రముఖ సినీనటుడు విజయ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 13 నుంచి రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు విజయ్ పర్యటనకు భద్రత కల్పించాలని కోరుతూ టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ ఇటీవల డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ ఈ నెల 13 నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఆ మేరకు తిరుచ్చి నగరంలో ఆయన ప్రచారం ప్రారంభించనున్నారని పార్టీ నేతలు తెలిపారు. విజయ్ పర్యటన కోసం సకల సదుపాయాలతో ఓ లగ్జరీ బస్సు పయనూరులోని ఆయన నివాసం వద్ద సిద్ధంగా ఉందని చెప్పారు.
ఆంధ్రాలో భారీ జన సమీకరణ చేసి పార్టీ ప్రారంభించిన నటుడు చిరంజీవి, ఆ పార్టీని రద్దు చేశారు, కానీ, ఈపీఎస్ ఎవరో కూడా తెలియదు అన్న నటుడు విజయ్ రాజకీయాల్లో ఏమి సాధిస్తారని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఎద్దేవా చేశారు.
మదురై మహానాడులో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ పార్టీలను విమర్శించడాన్ని ఖండిస్తూ ఆ పార్టీల నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర పురపాలక, పరిపాలనా శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ మాట్లాడుతూ... నలభై ఏళ్ల రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా రాష్ట్రప్రజలకు సేవలందిస్తున్న స్టాలిన్ను విజయ్ విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు.
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఫాసిస్టు బీజేపీని, పాయిజన్ డీఎంకేని చిత్తుగా ఓడించడమే తమిళగ వెట్రికళగం (టీవీకే) ప్రధాన కర్తవ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ శపథం చేశారు. మదురై సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన పార్టీ ద్వితీయ మహానాడులో ఆయన ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. తమ పార్టీకి సైద్ధాంతికి శత్రువు బీజేపీ అని, రాజకీయ శత్రువు డీఎంకే అని ప్రకటించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని టీవీకే అధ్యక్షుడు, సినీ హీరో విజయ్(Vijay) ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజలతో కలిసిపోయి, వారితో మమేకమైన పార్టీగా వచ్చే ఎన్నికల్లో నిరూపించబోతున్నట్టు విజయ్ వెల్లడించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిసి పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్కి విజ్ఞప్తి చేశారు. విజయ్ తనకు చిన్న తమ్ముడు లాంటివాడని, డీఎంకేను ఓడించేందుకు తమ కూటమిలో చేరాలని సూచించారు.
రాష్ట్రంలో 1967, 1977 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల తరహాలోనే 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుండబోతున్నాయని టీవీకే అధినేత విజయ్ జోస్యం చెప్పారు. యేళ్లతరబడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీలకు ఆ రెండు ఎన్నికలు గుణపాఠం చెప్పాయని, అదేవిధంగా రాబోవు ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం ఘనవిజయం సాధించి కొత్త చరిత్ర సృష్టించనుందని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ పతాకంలో ఎరుపు, పసుపు, ప్రత్యేక రంగుల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై, అఫిడివిట్ దాఖలు చేయాలని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్కు మద్రాసు హైకోర్టు నోటీసు జారీచేసింది.