Home » Hindupur
పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని భూములు తీసుకున్నారు. ఏడాది దాటినా నష్టపరిహారం చెల్లించలేదంటూ చిలమత్తూరు మండలం టేకులోడు గ్రామ రైతులు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం చిలమత్తూరులో ప్రజాదర్బార్ నిర్వహించారు.
జిల్లా కేంద్రం అనంతపురంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించారు. అఖండ-2 సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయిన సందర్భాన్ని పురష్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. అటు బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
హిందూపురం పోలీసులు ఓ ఘరానా దొంగను పట్టుకున్నారు. అతని వయస్సు 39 సంవత్సరాలు కాగా.. ఇప్పటివరకు 55 దొంగతనాలు చేశాడు. దీంతో పోలీసులే అతడిని చూసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...
ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన అధికారి డాక్టర్ సురే్షబాబు ఆదేశించారు.
పురం పట్టణ అభివృద్ధి చేయడమే లక్ష్యమని మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు.
పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. వీధికుక్కల సంఖ్య పెరగకుండా పటిష్ట చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్ అధికారుల్లో కదలిక వచ్చింది.
నెల్లూరు నగరంలో సీపీఎం నాయకుడు పెంచలయ్యను హత్యచేసిన గంజాయి బ్యాచను కఠినంగా శిక్షించాలని సీపీఎం, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ సర్కిల్లో నిరసన తెలిపారు.
ఎయిడ్స్ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి వెంకటేశ్వర్లునాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
హిందూపురం వస్తే.. తన పుట్టింటికి వచ్చినట్లుగా ఉంటుందని రాష్ట్రమంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ సంస్థల ఈడీ నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు, విద్యర్థులు బ్రాహ్మణికి ఘనస్వాగతం పలికారు.
సెల్ఫోన్.. మరో విద్యార్థిని ఊపిరితీసింది. ఫోన్ ఎక్కువగా చూడొద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం సత్యనారాయణపేటలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.