Home » Hyderabad
సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ(Rajasthan Chief Minister Bhajanlal Sharma) అన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన పార్టీ అధినేత ఏక్నాథ్ షిండే పిలుపు మేరకు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్ధి మాధవీలత(Madhavilatha)కు సంపూర్ణ మద్దతు శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రకటించింది.
జన్మనివ్వకపోయినా పెంచి పెద్ద చేసిన కుమార్తె పట్ల పెంపుడు తల్లి అమానుషంగా వ్యవహరించింది. బాలిక రజస్వల కాగానే ఆ చిన్నారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టింది. చెప్పినమాట వినకపోతే చిత్రహింసలకు గురి చేసి నరకయాతన పెట్టింది.
హైదరాబాద్లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. చాకచక్యంగా కాలేజ్ బ్యాగులో డబ్బు పెట్టి బైక్పై తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్పల్లిలోని వసంత్ నగర్ బస్టాప్ వద్దకు అనుమానాస్పదంగా రెండు హీరో ఫ్యాషన్ ప్రో బైక్లపై వచ్చారు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని పోలీసులు సోదా చేయగా.. వారిలో ఒకరి వద్ద గల బ్లాక్ కలర్ కాలేజీ బ్యాగ్లో రూ. 53 లక్షల37 వేల500 లభ్యమయ్యాయి.
‘వెయ్యి గొడ్లను తిన్న రాబందు.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగి చివరకు ఒక్క గాలి వానకు కొట్టుకుపోయిందన్న చందంగా కేసీఆర్ పరిస్థితి మారింది.
Telangana: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విరుచుకుపడ్డారు. 25 లక్షల మందిని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళను పైకి తీసుకువచ్చామని మోదీ అంటున్నారని.. అదే నిజం అయితే ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నట్లు..? అని ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పుకోవడంలో విఫలం అవుతున్నామని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, నిర్వహించిన సంక్షేమ పథకాలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్(Thiegulla Padma Rao Goud) అన్నారు.
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Former Minister Motkupalli Narsimhulu) తన ఇంటి పేరును ‘ఉసరవెల్లి’గా మార్చుకుంటే పేరుకు తగినట్టు అర్థవంతంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు డి.శ్రీశైలం వ్యాఖ్యానించారు.
ప్రచారం చేసుకునేవారిని పోలీస్ స్టేషన్కు తీసుకురావడమేమిటని ఫిర్యాదు చేసేందుకు కలిస్తే అసభ్య పదజాలంతో తిడుతూ బలవంతం గా వెళ్ల కొట్టాడని బీజేపీ నేతలు(BJP leaders) బోరబండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Telangana: బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో రిటర్నింగ్ వాల్ వాల్ కూలి ఏడుగురు కూలీలు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైజ్ కన్స్ట్రక్షన్ ఎండీ అరవింద్ రెడ్డిపై బాచుపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనాకు వచ్చారు.