Home » Hyderabad
ఆర్టీసీని మరింత విస్తరిస్తాం.. కొత్తగా 373 కాలనీలకు బస్సులు నడుపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... రాజధాని హైదరాబాద్ నుంచి గ్రామాల వరకు ఆర్టీసీని మరింత విస్తరిస్తామని ఆయన అన్నారు.
కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు టమోటా ధర రూ. 50 కిపైగానే ఉండగా.. ప్రస్తుతం దాని ధర తగ్గిపోయింది. అయితే.. బెండకాయ ధర పెరిగింది. కిలో రూ. 55 నుంచి రూ. 65 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..
వరద ముప్పులేని నగరం కావాలి... అలాగే వరద ముప్పులేని నగరం అందరి లక్ష్యం కావాలి.. అన్నారు హైడ్రా కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్. ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాదిలో వర్షాకాలం ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత వరద నియంత్రణలో విజయవంతమయ్యామన్నారు.
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. హైదరాబాద్-తిరుపతి ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 11వ తేదీన ఈ రైలును నడుపుతున్నట్లు తెలిపింది. అలాగే.. చర్లపల్లి-మంగళూరు జంక్షన్, మంగళూరు సెంట్రల్-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలపై కవిత స్పందించారు. ఆయన చేసిన ప్రతి ఆరోపణలకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్మీట్ పెడతానని వెల్లడించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఈ సంవత్సరం సుమారు 20కు పైగా ఫేక్ బెదిరింపు కాల్స్, మెసేజెస్ వచ్చాయని శంషాబాద్ డీసీపీ రాజేశ్ తెలిపారు. ఫేక్ కాల్స్ మెయిల్స్పై దర్యాప్తు స్పీడ్ అప్ చేశామని పేర్కొన్నారు.
భార్యపై భర్త కత్తితో దాడిచేసిన సంఘటన నగరంలోని వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆమెపై 25 కత్తిగాట్లు ఉండటాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఇందుకు సంబంధించిన వివకాలిలా ఉన్నాయి.
ఎవరు ఏమన్నా.. కేసీఆర్ చేసిన నిరాహార దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. దశాబ్దాల కల కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. అయినప్పటికీ కొందరు విమర్శలు చేస్తుండడం దారుణమన్నారు.
హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు అమెరికాలో మృతిచెందాడు. సంకీర్త్ పినుమళ్ల అనే యువకుడు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సైటోన్ ఒహియోలో ఎమ్మెస్ చేశారు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అయితే.. అక్కడ మంచు కురుస్తున్న కారణంగా కాలు జారి పడి మృతి చెందినట్టు సమాచారం.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై మాజీ మంత్రి హరీష్రావు సంచలన కామెంట్స్ చేశారు. గ్లోబల్ సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కాంకు తెరతీశారంటూ వ్యాఖ్యలు చేశారు.