Home » IMD
దేశంలో రుతుపవనాల విధ్వంసం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆగస్టు 18న ఆదివారం కూడా పలు రాష్ట్రాల్లో వర్షం(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. యూపీ, ఎంపీ, రాజస్థాన్ సహా 15 రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో గత 7 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల జోరు వర్షాలు(rains) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) 25 రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
తెలంగాణలో మరికొన్నిరోజులు మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. గురువారం నుంచి ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆగస్టు నెలలో రుతుపవనాలు చురుగ్గా ఉన్న క్రమంలో వర్షాలు(rains) విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ చుట్టుపక్కల నగరాల్లో నిన్న జోరు వాన కురిసింది. ఈ క్రమంలో ఢిల్లీలో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా 17 రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచనలు జారీ చేసింది. వాటిలో ఏయే రాష్ట్రాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షంలో ముందుకు కదలలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఆకాశం మేఘావృతమై ఉంది. ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. ఆదివారం రాత్రి పలుప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షం పడింది.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణం కన్నా అధికంగా వర్షిస్తున్న నేపథ్యంలో, కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న జిల్లాల్లో వారం రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
స్థానిక నుంగంబాక్కం(Nungambakkam)లోని వాతావరణ శాఖ కార్యాలయం సోమవారం తన ట్విట్టర్లో నమోదుచేసిన ప్రకారం... వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్నందున ఆనకట్టలు, చెరువులు, వాగులు నిండుతున్నాయి.
దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాలు(rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వెదర్ రిపోర్ట్(IMD) తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాలతో కేరళలో కొండ చరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. వయనాడులో పరిస్థితి దయనీయంగా మారింది. సహాయక చర్యల కోసం ఆర్మీ రంగంలోకి దిగింది. ఇంతలో భారత వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ ఇచ్చింది. వయనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీచేసింది. వయనాడు జిల్లా మెప్పాడిలో రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడి వరద ప్రవహం ఏరులై పారింది.
తెలుగు రాష్ట్రాలను వరుణ దేవుడు వణికిస్తున్నాడు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్న(Heavy Rains) వేళ ఐఎండీ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ 4 జిల్లాల్లో, శనివారం ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసింది.