Home » Indigo
ఇండిగో కార్యకలాపాల సంక్షోభంతో పెరిగిన విమాన టికెట్ ధరలను నియంత్రించేందుకు ఎయిర్ ఇండియా స్వచ్ఛందంగా ఎకానమీ టికెట్లపై ధర పరిమితి విధించింది. విమానయాన శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.
సోమవారంనాడు రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని, ఒక రైలు డిబ్రూగఢ్ నుంచి న్యూఢిల్లీ వరకూ, మరో రైలు గౌహతి నుంచి హౌరా వరకూ వెళ్తుందని ఎన్ఎఫ్ఆర్ సీపీఆర్ఓ కపింజల్ కిషోర్ శర్మ తెలిపారు.
ఫ్లైట్ల రద్దుతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఎయిర్లైన్స్ సంస్థ ఇప్పటివరకూ రూ.610 కోట్లను రీఫండ్ చేసినట్టు పౌర విమానయాన శాఖ తాజాగా తెలిపింది. ప్రయాణికుల లగేజీని కూడా తిరిగిచ్చినట్టు వెల్లడించింది.
ఆదివారం 650 ఫ్లైట్లను రద్దు చేసినట్టు ఇండిగో సంస్థ తాజాగా తెలిపింది. ఇక క్యాన్సిలేషన్తో ఇబ్బంది పడ్డ వారికి రీఫండ్లు ఇవ్వడంపై దృష్టి పెట్టినట్టు తెలిపింది. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సీఈఓ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్తో కూడిన క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూపును కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు రావాల్సిన 70 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన మరో 74 ఇండిగో విమానాలను ఎయిర్ లైన్స్ అధికారులు రద్దు చేశారు.
ఇండిగో సంక్షోభంతో డొమస్టిక్ విమాన సర్వీసుల టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ముంబై నుంచి కొచ్చి వెళ్లడానికి ఏకంగా 40 వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర విమానయాన శాఖ విమాన ప్రయాణీకులకు గుడ్న్యూస్ చెప్పింది.
ఇండిగో మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ ఉన్నత స్థాయి సమీక్షకు ఆదేశించింది. కంపెనీ సీఈఓ పీటర్ ఎల్బర్స్ను పదవి నుంచి తొలగించాలని విమానయాన శాఖ కోరినట్లు తెలుస్తోంది.
ఇండిగో విమానం రద్దుతో విసిగిపోయిన ఓ ఆఫ్రికా మహిళ సంస్థ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ముంబై ఎయిర్పోర్టులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. జనాలు ఈ ఉదంతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇండిగో సంక్షోభం కారణంగా కొన్ని వేల మంది విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో విమాన సర్వీసులు రద్దు అవుతుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. అన్ని రకాలుగా తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇండిగో ఆపరేషనల్ సిస్టంను రీబూటింగ్ చేసిన కారణంగా విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం తలెత్తిందనీ, రద్దయిన విమానాల పాసింజర్లు ఎయిర్పోర్టులకు రావద్దని, మరిన్ని ఇబ్బందులకు గురికావద్దని పీటర్ ఎల్బర్స్ కోరారు.