Home » Indigo
గత వారం రోజులుగా దేశంలోని ఎయిర్లైన్స్ సంస్థల విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కాల్స్ నకిలీవే అయినప్పటికీ ఎవరు చేస్తున్నారనేది అంతుచిక్కడం లేదు. ఈ మేరకు ఇంటెలిజెన్సీ ఏజెన్సీలు రంగంలోకి దిగినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో పర్యాటక రంగానికి నష్టం వాటిల్లడమే కాకుండా ప్రయాణీకులు కూడా తెగ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జబల్పూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానం నెంబరు 6ఈ 7308కి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది.
ప్రముఖ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ విండోస్(microsoft windows) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులను ఇబ్బందుల్లో పడేసింది. ఈ క్రమంలో జూలై 19న అనేక మంది వినియోగదారుల కంప్యూటర్లలో Windows “బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్” (Blue Screen of Death) లోపాన్ని ఎదుర్కొన్నారు.
ఒక విమానం గాల్లో ఉన్నప్పుడు.. కుదుపులు అనేవి సర్వసాధారణంగానే సంభవిస్తుంటాయి. ఆకాశంలో వాతావరణం అనుకూలంగా లేనప్పుడో, సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడో..
ఇండిగో విమానానికి మంగళవారం రాత్రి 10.24 గంటలకు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. 6E 5149 విమానాన్ని ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 196 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. విమానం ల్యాండ్ చేసిన తర్వాత సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిట ఫోర్స్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానం తనిఖీ చేసేందుకు ప్రయాణికులు చక్కని సహకారం అందజేశారని ఇండిగో ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి తర్వాత ఒక ప్రకటనలో తెలిపారు.
ఇండిగో విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్లో అత్యవసరంగా దించారు. అనంతరం విమానాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఇవి నకిలీ బాంబు బెదిరింపు అని భద్రత సిబ్బంది నిర్ధారించారు..
దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో(Indigo) కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో దేశీయ విమానాలలో ప్రయాణించేందుకు(travel) రూ.1,199, అంతర్జాతీయ విమానాలకు రూ.4,499 చెల్లిస్తే చాలని తెలిపింది. మీరు ఈ సేల్ను సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చులతో సెలవులకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారాణసీ వెళ్తున్న ఇండిగో(6ఈ2211) విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ప్రయాణికులు కకావికలమయ్యారు. మంగళవారం ఉదయం 5 గంటలకు ఈ విమానం బయలుదేరాల్సి ఉండగా.. ఆగంతుకులు
ఢిల్లీ- వారణాసి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. ఉదయం 5.35 కు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ప్రయాణికులందరినీ ఎమర్జెన్సీ డోర్ ద్వారా సిబ్బంది తిరిగి ఎయిర్పోర్టులోకి తరలించింది. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు.
బస్సులు, రైళ్లలో ప్రయాణికులు నిండుగా ఉన్నప్పుడు.. కూర్చోవడానికి సీటు లేక నిల్చొనే వెళ్తుంటారు. ఇది సర్వసాధారణం. కానీ.. విమానంలో ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా?