Home » Insurance
మీరు తక్కువ పెట్టుబడి(investment) పెట్టడం ద్వారా పెద్ద మొత్తాలు రావాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. అందుకోసం LIC జీవన్ ప్రగతి ప్లాన్(lic jeevan pragati plan) బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ స్కీంలో 12 ఏళ్లలోపు పిల్లల నుంచి 45 ఏళ్లలోపు వ్యక్తులు పెట్టుబడి పెట్టవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవితంలో భద్రత కోసం లైఫ్ ఇన్సూరెన్స్ను తీసుకుంటూ ఉంటారు. అనుకోకుండా ఏమైనా జరిగినా.. లేదంటే పొదుపు కోసం కూడా ఎక్కువ మంది బీమా తీసుకుంటారు. సాధారణంగా బీమా తీసుకునేటప్పుడు ముందు, వెనుక ఆలోచించకుండా కొంతమంది తొందరపడి ఇన్సూరెన్స్ తీసుకుంటారు.
ఆరోగ్య బీమా పాలసీ హోల్డర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీమా నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీదారుల నుంచి క్లెయిమ్ అభ్యర్థనను స్వీకరించిన గంటలోపు బీమా కంపెనీలు నగదు రహిత చికిత్సను అనుమతించాలని స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఓ చోట రహదారులు నెత్తురోడుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ఖేరి వద్ద ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీ కొట్టడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఇలా నిత్యం ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. బాధితులకు అందజేసే ప్రమాద క్లెయిమ్లు(Mishap Claims) సమయానికి అందుతున్నాయా లేదా అనే విషయంలో స్పష్టత కోరుతూ ఏప్రిల్లో సుప్రీంకోర్టు న్యాయవాది కేసీ జైన్ ఆర్టీఐకి దరఖాస్తు చేశారు.
హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న నమ్మకంతో ఆసుపత్రిలో చేరిన మహిళకు సంస్థ హ్యాండిచ్చింది. దీంతో, తిక్కరేగిన బాధితురాలు వెంటనే సంస్థ తీరును నెట్టింట ఎండగట్టింది.
బ్రిటన్లో కొంతకాలం క్రితం జరిగిన ఓ రియలెస్టే్ట్ మోసం మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
అనవసరమైన ఆర్థిక ఒత్తిడి లేకుండా అవసరమైన సంరక్షణను బీమా సంస్థలు అందజేస్తాయి.
సామాన్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను తీసుకొచ్చింది. అందులో జీవిత బీమాకు సంబంధించిన ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన. మహత్తరమైనది. కేవలం రూ.436 చెల్లిస్తే రూ.2లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. సామాన్యులకు సైతం తక్కువ అందుబాటులో ఉండాలని తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజనను తీసుకొచ్చింది. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి రూ.2లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము అందుతుంది.
నిత్యం వివిధ రకాల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. నిబంధనలు పాటించని కారణంగా కొన్నిసార్లు, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా మరికొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాహానాలకు గానీ, మనుషులకు గానీ ఏం జరిగినా.. ఇన్సూరెన్స్ చేసి ఉన్నట్లయితే..
మోసగాళ్ల కన్ను పడని రంగం కనిపించడం లేదు. వాహనాలకు బీమా చేయడంలో కూడా నకిలీలు వేధిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినపుడు అసలు విషయం వెలుగులోకి వస్తోంది. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించవలసి వస్తోంది. ఇటువంటి సంఘటన తాజాగా నవీ ముంబైలో జరిగింది. వాహనాలకు నకిలీ బీమా పాలసీలను విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.