Home » KADAPA
అరటి రైతుపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ సాగును లాభసాటిగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా మద్దతు ధరతో కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా డిసెంబరు 15 నుంచి నార్త్ నుంచి వ్యాపారులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేసింది.
లోన్ యాప్లతో జాగ్రత్తగా ఉండాలని అవసరం ఏర్పడింది. ఆర్ధిక అవసరాల కోసం ఈ యాప్ల ద్వారా నగదు తీసుకుంటే... ఇక వారి జేబులు ఖాళీ అయనట్లే.. అంతటితో ఆగకుండా మానసికంగా ఎన్నో వేధింపుకు గురిచేస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రాజంపేట పట్టణం అభివృద్ధిలో తిరోగమన దిశలో పయనిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంగా, వందేళ్లుగా ఐఏఎస్ కేడర్ కలిగిన సబ్ కలెక్టర్ కార్యాలయ కేంద్రంగా ఎంతో పేరు గడించిన రాజంపేట పట్టణం కాలానికి తగినట్లు అభివృద్ధికి దూరంగా ఉంది.
ఏపీలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనని ఆయన తెలిపారు. కడప జిల్లాలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
డిజిటల్ అరెస్టు పేరుతో పలువురిని సైబర్ క్రిమినల్స్ మోసగిస్తున్నారు. సైబర్ నేరస్తుల బారిన పడి బాధితులు పెద్దమొత్తంలో నష్టపోతున్నారు. తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్యని డిజిటల్ అరెస్ట్ పేరిట చీటింగ్కు పాల్పడ్డారు సైబర్ క్రిమినల్స్.
ప్రయాణికుల సౌకర్యార్థం కోయంబత్తూరు-మదార్ (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోయంబత్తూరు-మదార్ ప్రత్యేక రైలు (నం. 06181) ఈ నెల 13, 20, 27, డిసెంబరు 4 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06182) ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7 తేదీల్లో నడపనున్నట్లు వెల్లడించారు.
హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఓ 17 ఏళ్ల బాలికను అదే కళాశాలలో సీనియర్గా చదువుకుంటున్న యువకుడు ప్రేమ పేరుతో తల్లిని చేశాడు. ఆ బాలిక గురువారం ఆసుపత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కడపలోని వసతి గృహంలో ఉంటూ కాలేజీకి వెళ్లి తిరిగి హాస్టల్కు వస్తుండేది.
విద్యా విధానంలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలోని ఆరు పరీక్షలను ఐదింటికి కుదించింది. ఈ నేపధ్యంలో సబ్జెక్టుల మార్కులు మారాయి.
మండలంలోని గొళ్లపల్లి పంచాయతీ పరిధిలోని గుడిసివారిపల్లి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం కలకలం రేపింది. అవివాహితుడైన యువకుడిని విచక్షణారహితంగా తలపై కొట్టి చంపి పడేసినట్లు తెలియడంతో గొళ్లపల్లి చుట్టుపక్కల జనం ఉలిక్కిపడ్డారు.
మచిలీపట్నం - కొల్లం మధ్య కడప మీదుగా ప్రత్యేక వీక్లీ రైలు (నెంబర్ 07103/07104) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎ.జనార్దన్ తెలిపారు.