Home » Kakani Govardhan Reddy
ఎన్నికల్లో ఘోర ఓటమితో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్టేషన్ వెళ్లగక్కారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతిలో కాకాణి ఘోరపరాజయం పాలయ్యారు. అపజయాన్ని కాకాణి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు చేసిన అరాచకాలకు అంతూపంతూ లేకుండా పోతోంది. తవ్వేకొద్దే వారి అఘాయిత్యాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పిన్నెల్లి, తాడిపత్రి, తిరుపతి ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా... గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ కూటమి నేతలపై దాడులు చేయడం, దీన్ని సమర్థవంతంగా తెదేపా శ్రేణులు తిప్పికొట్టిన సంగతీ తెలిసిందే. సర్వేపల్లి నియోజకవర్గంలోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి.
బెంగళూర్ రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవ్ పార్టీలో సినీ సెలబ్రిటీలు, ఇతరులు పాల్గొన్నారు. పార్టీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న వాహనం ఉంది. మంత్రి, అతని సంబందీకులు ఎవరూ పార్టీలో పాల్గొనలేదని ప్రాథమిక సమాచారం.
నెల్లూరు: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫాం హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టికర్ ఉండే కారు, పాస్ పోర్టు చిక్కాయని, తనది కాదని చెబుతున్నారని, ఇక్కడ దొరికిన గ్యాంగ్కు రింగ్ మాస్టార్ కాకాణి అని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరులు, కిరాయి రౌడీమూకలు రెచ్చిపోతున్నాయి. దీంతో పలు గ్రామాలు ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. టీడీపీ శ్రేణులు, సానుభూతిపరులపై వరుస దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి.
Andhrapradesh: సర్వేపల్లి టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సోమిరెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కూటమి అభ్యర్థి నామినేషన్కు వేలాదిగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో వెంకటాచలం జాతీయ రహదారి జన సందోహంగా మారింది. నామినేషన్ వేసిన అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సర్వేపల్లి అభ్యర్థిగా రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
ఎన్నికలు(AP Elections 2024) దగ్గరపడుతున్నా కొద్ది వైసీపీ(YCP) నేతల్లో ఓటమి భయం ఎక్కువైపోతోంది. దీంతో ఓటర్లను(Voters) ప్రలోభాలకు గురి చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Minister Kakani Govardhan Reddy) ఓటమి భయం పట్టుకుంది.
Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు మరో 20 రోజులే సమయం ఉంది. దీంతో పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అధికార పార్టీకి చెందిన నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను తమవైపు తిప్పుకునేలా ప్లాన్స్ చేస్తున్నారు. మద్యం తరలింపులపై పోలీసులు ఎక్కడిక్కడ చెక్పోస్టులు...
సర్వేపల్లి నియోజకవర్గంలో భూ కుంభకోణాలు పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, ఆయన అల్లుడు ఆగడాలు పెరిగిపోయాయని వివరించారు.
Nellore News: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు(AP Assembly Elections) సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రంలో ఈసారి వైసీపీ(YCP) ఓటమి దాదాపు ఖాయం అని ప్రజల్లో గట్టి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి తాను ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy) భారీ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పరిశీలనలో అడ్డగోలు నియామకాల వ్యవహారం..