Home » kaleshwaram
బ్యారేజీల నిర్మాణంలో ప్రమాణాలకు ఉద్దేశించిన భారతీయ ప్రమాణాల సంస్థ (ఇండియన్ స్టాండర్డ్) కోడ్-7349ను కాళేశ్వరం నిర్మాణంలో పాటించలేదని, నిర్వహణకు ఉద్దేశించిన క్లాజులను కూడా అమలు కాలేదని సంబంధిత నిపుణులు గుర్తించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణం/నిర్వహణ లోపాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ కమిషన్కు నీటిపారుదల శాఖ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారా?
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద వేర్వేరు ఎత్తులతో బ్యారేజీ నిర్మిస్తే కలిగే ముంపును తెలిపే సూచీ పటాలు, టోపోషీట్లు అందించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నీటిపారుదల శాఖ అధికారులను కోరింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జరుగుతున్న విచారణ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుండగా విచారణ ప్రక్రియలో పలు దశలు మిగిలి ఉండడాన్ని గుర్తించిన ప్రభుత్వం.
కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు కరెంటు కొనుగోలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ల గడువు రెండు రోజుల్లో ముగియనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణ లోపాలు, అవినీతిపై ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ అధికారుల్లో మరోమారు గుబులు మొదలైంది. ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు ఇరిగేషన్ అధికారులు అఫిడవిట్ సమర్పించినట్లు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరైన వారికి అఫిడవిట్ల దాఖలుకు ఇచ్చిన గడువు ఈ నెల 27వ తేదీతో ముగియనుంది.
మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో చేపట్టిన తాత్కాలిక మరమ్మతు పనులు చివరి దశకు చేరుకున్నాయి. గ్రౌటింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకోగా షీట్ పైల్స్ అమరిక పనులు పూర్తికావస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేపట్టిన తొందరపాటు చర్యలేబ్యారేజీలను దెబ్బతీశాయా? అవసరమైన సర్వేలు నిర్వహించి, నిర్ధారిత ప్రమాణాలను జాగ్రత్తగా పాటిస్తూ పదేళ్ల సమయంలో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేవలం మూడేళ్ల వ్యవధిలోనే హడావుడిగా పూర్తి చేయడమే బ్యారేజీల కుంగుబాటుకు కారణమా?
లైంగిక వేధింపుల ఆరోపణలతో రెండేళ్ల క్రితం వేటు పడ్డా ఆ పోలీసు అధికారి బుద్ధి తెచ్చుకోలేదు. గతంలో పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతున్న ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడి సస్పెండైనా పద్ధతి మార్చుకోని ఆ అధికారి కొన్నాళ్లుగా సహచర ఉద్యోగినిపైనే కన్నేశాడు.